వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందంజలో ఉందని నాబార్డ్ వారు నిర్వహించిన సర్వేలో తేలిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసారెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ 2019లో ప్రమాణ స్వీకారంచేసిన తర్వాత ఏపీలోని రైతులకి మేలు చేకూరేలా ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను జగన్ ప్రభుత్వం నిర్మించింది. అందులో ప్రాంతాన్ని బట్టి అగ్రికల్చరల్ ఆఫీసర్ , ఆక్వా రంగంలో వ్యవసాయం చేసే ప్రదేశాలలో ఆక్వా కల్చరల్ ఆఫీసర్ ని ప్రభుత్వం నియమించింది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ గ్రామంలో ఉన్న రైతులకి ఆ గ్రామంలోని పంటలకి సంబంధించిన ఎరువులు ఇతర రసాయనాలు అక్కడే లభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొత్తగా వ్యవసాయ రంగంలోకి రావాలనుకునే యువరైతులకి అగ్రికల్చరల్ ఆఫీసర్ ద్వారా సలహాలను కూడా ఎపి ప్రభుత్వంఅందిస్తోంది. ఏ రైతైనా తమ తమ ప్రాంతాలలో ఇంతవరకు పండించని కొత్త పంటని వేయాలనుకుంటే అక్కడ ఉన్న అగ్రికల్చరల్ ఆఫీసర్ ద్వారా సలహాలు సూచనలు తీసుకోవచ్చు.
వ్యవసాయానికి సంబంధించిన పథకాలపై రైతులకి సమగ్ర అవగాహన కల్పిస్తూ దరఖాస్తు నుంచి అమల వరకు రైతు భరోసా కేంద్రాలు అన్నదాతలకు అన్ని విధాల సహాయపడుతున్నాయని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇదే సందర్భంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు ఆర్థిక సామాజిక పురోగతి సాధించారని, రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్దే లక్ష్యంగా చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిచ్చాయని అన్నారు