వేసవిలో కోల్డ్ చైన్ సెక్టార్ల ఇంధన సామర్థ్య చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ శాఖ ప్రయత్నం చేస్తుంది. వేసవిలో వ్యవసాయ ఉత్పత్తులను సంరక్షించుకోవడంలోనూ విద్యుత్ పొదుపు కోసం రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ ద్వారా ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో అగ్రికల్చర్ డిమాండ్ స్టేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభించింది.
భవిష్యత్ తరాలకు విద్యుత్ వెలుగులను అందించడం కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రయత్నంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండి ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఇంధన పొదుపుని మరింత ప్రోత్సహించేందుకు ఇంధన సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు రాష్ట్రంలో సమీకృత కోల్డ్ చైన్ సెక్టార్లు ఇంధన సామర్థ్య చర్యలను రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ అమలు చేయనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఆర్థిక సహకారం అందిస్తోంది.
కోల్డ్ చైన్ వ్యవసాయం, మార్కెట్ మధ్య కీలకమైన లింకుని ఏర్పరుస్తుంది. రైతులని సమీపంలోని గాని, దూరంగా ఉన్న మార్కెట్లను అనుసంధానించడానికి వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువ పెంచడానికి సహాయపడుతుంది.తద్వారా కోత తర్వాత ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టం తగ్గుతుంది. ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్ , కోల్డ్ చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో భాగంగా ఉత్పత్తి స్థలం నుంచి వినియోగం వరకు ఈ లైన్ లో పాల్గొన్న సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. అంటే పంట పెట్టడం మొదలు అమ్మే వరకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తుంది ఈ ప్రోగ్రాం. సరికొత్త ఎనర్జీ ఎఫిషియన్సీ టెక్నాలజీలను అనుసరించేందుకు సైతం సహకరిస్తారు ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 3,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
కోల్డ్ చైన్ సెక్టార్లో అవగాహన నిమిత్తం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్స్ సౌకర్యాలు, వెబ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ లో సరికొత్త సాంకేతికతలను నేర్చుకోవడం కోసం మార్గదర్శకాలను అభివృద్ధి చేసే ప్రక్రియ ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. కోల్డ్ చైన్ యజమానులు, సిబ్బంది , డిజైన్ కన్సల్టెంట్లకి శిక్షణ కూడా ఇస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో 500 మందికి శిక్షణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ విజయవంతంగా పూర్తి చేసింది. కోల్డ్ చైన్ సెక్టార్లో ఇంధన సామర్ధ్య చర్యలపై అవగాహన కల్పించింది.