ఈ రోజు సంపద సృష్టిస్తా, కంపెనీలు లాక్కొస్తా, ఉద్యోగాలు కురిపిస్తా అనే బాబు అధికారం చేపట్టిన కొత్తల్లో మూసేసిన, దివాలా తీయించిన ప్రభుత్వ, సహకార రంగ కంపెనీల లిస్టు చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే, అడ్డికి సేరుకి అయిన వారికి కట్టబెట్టిన కంపెనీల లిస్టు చూస్తే నోరు వెళ్ళబెట్టాలసిందే. బాబు చేపట్టిన ఈ దివాలాకోరు చర్యల వలన ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు, బలవన్మరణం పొందిన ఉద్యోగులు ఎందరో.
ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేదు అని సాకు చూపుతూ పలు ప్రభుత్వ సంస్థలని ప్రైవేటు పరం చేసిన బాబు ఆ సంస్థలో పని చేసే కార్మికుల బతుకులు రోడ్డు పాలు చేశాడు… అలాంటి వాటిల్లో ఆల్విన్ ఒకటి .
1993 లో అల్విన్ మెటల్స్ సంస్థ నష్టాల్లో ఉన్న కారణం చేత ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కానీ ఉద్యోగాల నుండి రిలీవ్ కాబడ్డ వారి జీవితాలకు భరోసా కల్పిస్తూ ప్రభుత్వం పలు హామీలు ఇచ్చింది…
1995 లో సీఎం అయిన బాబు కంటికి కనపడ్డ ప్రభుత్వ సంస్థల అమ్మకం మొదలు పెట్టాడు.. అందులో భాగంగానే అల్విన్ మెటల్స్ ప్రేవేటీకరణ నిర్ణయాన్ని పూర్తి చేసే భాద్యత నెత్తికెత్తుకున్నాడు.. ఎలాగూ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి ఉద్యోగుల గురించి గత ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించి నాకెందుకు అనుకున్నాడో ఏమో రాత్రికి రాత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఆమోదించి 1500 మంది కార్మికుల భవిష్యత్ గురించి ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండా వారికి ఉద్వాసన పలికేశాడు…
ఆశ్చర్యకరంగా ఈ నిర్ణయానికి నెల ముందే హైకోర్ట్ ఆ ఉద్యోగులని తొలగించవద్దని, వేరే శాఖల్లో భర్తీ చేయాలని ఆదేశించినా ఆ తీర్పును కూడా పట్టించుకోలేదు… తర్వాత కోర్టు వివరణ కోరగా ప్రభుత్వం రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలలో వారిని భర్తీ చేయరాదని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ఓ వింత వాదన వినిపించింది…
ఇలా 1500 మంది కార్మికులను రోడ్డు పాలు చేసి వారి అగమ్య గోచరంగా మార్చేశాడు బాబు… తమ జీవితాలను ఎలా ముందుకు తీసుకువెళ్లాలో తెలియక ఉద్వాసనకు గురైన కార్మికులు ఆందోళనకు గురవ్వగా నర్సింహా అనే ఉద్యోగి భవిష్యత్తు పట్ల భయంతో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం . ఇలా బాబు మూసేసిన, అమ్మేసిన పలు కంపెనీలలో బలవన్మరణం పాలయ్యిన, రోడ్డున పడ్డ వారు ఎందరో.
ప్రభుత్వాలు ఉంది పన్నుల రూపం లో ప్రజలను పీల్చి పిప్పి చేసి ఖజానా నింపుకోవడానికే అని భావించి, వాటిని తమ అనునాయులకు కట్టబెట్టడం కోసం బాబు ఎంచుకున్న మార్గమే ప్రైవేటీకరణ….