విజయవాడలో స్పా (మసాజ్ సెంటర్) ల ముసుగులో క్రాస్ మసాజ్ పేరుతో వ్యభిచారాన్ని నిర్విస్తున్న కేంద్రాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అరెస్ట్ చేసారు. టీడీపీ హయాంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిన స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారం పై వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉక్కుపాదం మోపింది. 2019 లోనే నిర్వాణ మరికొన్ని స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ల పై దాడి చేసి దొరికిన విటులను విచారణ చేయగా విస్తుబోయే నిజాలు తెలిశాయి. మొత్తంగా విజయవాడలో మసాజ్ సెంటర్ల పేరిట దాదాపు 120 మంది విదేశీ యువతులతో, పలువురు ఇతర రాష్ట్రం యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారని తెలిసి ఆ స్పాలను మూసి వేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.
అది మొదలు ఈ స్పాలపై కన్నేసి ఉంచి సమాచారం అందడం ఆలస్యం వారిపై దాడులు చేయగా ఈ మసాజ్ సెంటర్ ల పేరుతో నిర్వహించే వ్యభిచారం ఆగిపోయింది. 2023 లో కూడా విజయవాడ లోని రెండు స్పా సెంటర్ లపై ఏసిపి పి. భాస్కర్ రావు ఆధ్వర్యంలో దాడి చేసి 17 మందిని అరెస్ట్ చేసి ఆ రెండు సెంటర్లను మూసి వేయగా కొంతకాలం పాటు ఈ వ్యాపారం పూర్తిగా నిర్వీర్యం అయ్యింది.
తాజాగా మళ్లీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్పా సెంటర్లపై మరోసారి దాడులు నిర్వహించి పటమట, మాచవరం, సూర్యారావు పేట, కానూరు లలో నిర్వహించబడుతున్న మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసి 24 మంది పురుషులను, 25 మంది మహిళలను అరెస్ట్ చేశారు.