దక్షిణ భారత్లో వ్యాపార విస్తరణకు ఏపీ అనుకూలంగా ఉందని, గత నాలుగేళ్లలో ఏపీలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని టాలీ సొల్యూషన్ సౌత్ ఇండియన్ హెడ్ భువన్ రంజన్ వెల్లడించారు. టాలీ ప్రైమ్ 4.0 సాఫ్ట్వేర్ను విశాఖలో గురువారం ఆవిష్కరించిన భువన్ రంజన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో 2019లో 4.05 లక్షల చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఉంటే 2023 నాటికి 5.61 లక్షలకు చేరాయని దాదాపు 40శాతం ఉపాధి అవకాశాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. రాబోయే రెండేళ్లలో 100 ఎంఎస్ఎంఈ వ్యాపార క్లస్టర్లను ప్రారంభించాలని జగన్ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుందని, రాష్ట్రంలో టాలీ సాఫ్ట్వేర్ను 50 వేల మందికి పైగా ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వ నిర్ణయం, తమ వ్యాపార విస్తరణకు తోడ్పడి, వచ్చే రెండేళ్లలో ఈ సంఖ్య 4 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని టాలీ సొల్యూషన్ సౌత్ ఇండియన్ హెడ్ వెల్లడించారు.
రాష్ట్రంలో రెండేళ్ల పాటు కరోనాతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వెరవక, రాష్ట్ర ప్రగతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఏపీని అభివృద్ధి పథంలో నడుపుతూ 40 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరిగేలా చేయడంలో జగన్ సర్కారు సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఓవైపు సంక్షేమ పథకాల ఫలాలను నేరుగా ప్రజల ఇంటికే చేరుస్తూ, మరోవైపు ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని తేటతెల్లమవుతుంది.