ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ నేపథ్యంలో వైజాగ్ పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. రాష్ట్రంలో అధికార వైసీపీ టీడీపీపై ఆరోపణలు చేస్తుండగా మరోవైపు టీడీపీ వైసీపీపై ఆరోపణలు చేస్తుంది. ఇరువర్గాల కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు చంద్రబాబు గురించి కొత్త చర్చను తెరపైకి తీసుకువచ్చారు. ఇప్పుడీ చర్చ ఆసక్తికరంగా మారింది.
రాష్ట్రంలో ఎన్నికల్లో పురుష ఓటర్లను ఆకట్టుకోవడానికి మద్యాన్ని ఏరులుగా పారించడం,ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బును వెదజల్లడం ప్రారంభించిన నేతగా చంద్రబాబుకు పేరు దక్కించుకున్నాడు. చంద్రబాబు కారణంగానే డబ్బు, మద్యం ఎన్నికల్లో ప్రవేశించాయన్నది కొందరి వాదన. ఓటర్లకే కాకుండా ఎమ్మెల్యేలకు కూడా ప్రలోభాల ఎర వేసిన నేతగా చంద్రబాబు పేరు గడించాడు. చంద్రబాబు మొదలుపెట్టిన ప్రలోభాల సంస్కృతి ఇప్పుడు దేశ రాజకీయాల్లో సాధారణంగా మారిపోయింది. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ చంద్రబాబుకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ సమస్య కారణంగానే డ్రగ్స్ రాష్ట్రంలో అడుగుపెట్టాయన్నది కొందరి వాదన.
ఇంతకీ అసలు విషయం ఏమంటే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దుకాణాల్లోనే మద్యం అమ్మేలా చర్యలు తీసుకున్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో మద్యం పెద్ద ఎత్తున పంచేందుకు వీల్లేకుండా పోయింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకే చంద్రబాబు గంజాయితో పాటు డ్రగ్స్ పై ఆధారపడ్డారని వాటిని రాష్ట్రంలో ఎన్నికల వేళ పంచేందుకు సిద్ధమయ్యే విశాఖకు రప్పించారనే చర్చ జరుగుతుంది. కానీ ఇంటర్ పోల్ సమాచారం మేరకు సీబీఐ అధికారులు విశాఖ పోర్టుకు చేరుకున్న డ్రగ్స్ ను పట్టుకోవడంతో చంద్రబాబు వేసిన ప్లాన్ బెడిసికొట్టిందని, కానీ ఇప్పడు తన సన్నిహితులు ఈ కేసులో చిక్కుకోవడంతో వారిని ఎలా కేసు నుండి తప్పించాలని తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. తన సన్నిహితులు నోరు తెరిస్తే తన గుట్టు రట్టవుతుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారట. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ & నార్కోటిక్స్ అధికారులు త్వరలోనే కేసు చిక్కుముడి విప్పితే డ్రగ్స్ వెనుక దాగున్న అసలైన వ్యక్తుల పేర్లు బయటపడతాయి. ఈ కేసులో 40ఇయర్స్ ఇండస్ట్రీకి వాటా ఉందో లేదో కొద్దిరోజుల్లో తేలనుంది.