రాష్ట్రంలో బలంగా ఉన్న కాపు సామాజికవర్గ ఓట్లపైనే గంపెడాశలు పెట్టుకుని, వారి మద్దతుతో ఏ కష్టం లేకుండా సునాయాసంగా రాజకీయ నేతగా ఎదిగిపోవచ్చని కలలు కని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఆ సామాజికవర్గమే 2019 ఎన్నికల్లో షాక్ ఇచ్చింది. దానికి కారణం చంద్రబాబుతో పడిన లాలూచీనే అని ఆ సామాజిక వర్గ ప్రజలే బలంగా నమ్మారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కి ఊడిగం చేయడానికి తాము సిద్దంగాలేమని కాపు సామాజికవర్గం తెగేసి చెప్పింది.
2019 దారుణ ఓటమి తరువాత కాపు సామాజిక వర్గ ఆశలను తాను గుర్తించానని రాజ్యాధికారంలో భాగస్వామ్యంగా ఉండాలని, కాపులు కూడా సీఎం స్థానం సాధించాలని దానికే తాను వ్యూహాలు పన్నుతున్నానని కాబట్టి కాపు సామాజికవర్గం నాకు మద్దతుగా ఉండాలని పలు ఇంటర్నల్ మీటింగ్స్ లో చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆ సామాజిక వర్గంలో ఆశలు రేపాడు. అయితే ఇదంతా చంద్రబాబుకి మేలు చేయడానికే తప్ప నిజంగా రాజ్యాధికారం సాధించేందుకు కాదని వారికి తెలియటానికి ఎన్నో రోజులు పట్టలేదు.
రానున్న ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే సాధించి తాను ఎన్నికల్లో పోటీ చేయడానికి బలంగా లేనని దానికి కారణం తన పార్టీ నేతలు, కార్యకర్తలని తన చేతగానితనాన్ని తన పార్టీ కార్యకర్తలు నేతలపై పవన్ కళ్యాణ్ మోపే ప్రయత్నం చేసాడు. దాంతో జనసేనని నమ్ముకున్న నేతలు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ మేకతోలు కప్పుకున్న తోడేలన్న నిజం తెలిసింది. పవన్ కార్యకర్తలను అవమానించడంతో కాపు సామాజిక వర్గంలో పవన్ పై ఆశలు సన్నగిల్లడంతో పాటు ఆగ్రహమూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సర్వేలో పవన్ గతంల్లో కన్నా కాపుల్లో భారీగా నమ్మకాన్ని కోల్పోయాడని వెల్లడైంది.
అంతకముందు వరకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కాపుల్లో జనసేనకు 55 శాతం , వైసీపీకి 35 శాతం, టీడీపీకి 10 శాతం మద్దతు ఉండేది. కానీ 24 సీట్ల ప్రకటన తరువాత అలాగే తాడేపల్లిగూడేంలో జరిగిన బహిరంగ సభలో మన పార్టీకి బలం లేదు, బాబు ఇచ్చిన 24 సీట్ల తీసుకోవాలి కానీ నన్ను ప్రశ్నించకూడదని పవన్ కళ్యాణే స్వయంగా చెప్పిన తరువాత పూర్తిగా కాపుల్లో వ్యతిరేకత మూటకట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి ఒక సర్వే బృందం పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వేలో భాగంగా 300 మంది కాపులని ఎవరికి ఓటు వేస్తారని అడిగితే జనసేన + టీడీపీ వేస్తాం అన్నవాళ్ళు 48 శాతం అయితే, వైసీపీ కి వేస్తాం అన్నవాళ్ళు 52 శాతం ఉన్నారు. అలాగే 40 ఏళ్ళ వయస్సు దాటిన కాపుల్లో పవన్ వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి కనిపించింది.
కొంతమంది కాపు యువత అయితే పవన్ వీక్ నెస్ ఏదో బాబు దగ్గర ఉంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని నమ్ముతున్నారు. గోదావరి జిల్లాలో ఉన్న 34 సీట్లలో 25 పై సీట్లు ఖచ్చితంగా వైసీపీకే వస్తాయని వారి మాట గా వినిపిస్తుంది. ఇక కృష్ణ గుంటూరులో అయితే పవన్ ప్రభావం అసలే లేదు అంటూ తేల్చేశారు. చివరికి ఒక సామాజిక వర్గాన్ని పవన్ తన రాజకీయ నిచ్చెనగా వాడుకోవాలని అనుకుంటే అది జరిగేది కాదని అందరి నోట వినిపిస్తున్న మాట.