వైయస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తన కార్యకర్తలను సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తూ ఎన్నికల మోడ్ లోకి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ నెల 18న అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని భీమిలిలో , కోస్తాంధ్ర లోని దెందళూరు లో ఈ సభలు ఏర్పాటు చేసారు. మొదటి సభకు 3లక్షల నుంచి 5 లక్షల మంది హాజరు అవ్వగా , దెందలూరు సభకు 5 లక్షల నుంచి 7 లక్షల మంది హాజరు అయ్యారు. ఫిబ్రవరి వ 18 తేదీ అనంతపురంలో జరిగే ఈ సభకు 10 నుంచి 15 లక్షల మందికి హాజరుకానున్నట్లు అంచనా, ఇందుకోసం సభను దగ్గరుండి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి . ఇదే సభలో 2024 ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తారు అని సమాచారం . ఇలా వరస సభలు పెట్టకుంటూ , కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ సిద్ధం అంటూ ముందుకు దూసుకు వెళ్తున్నారు జగన్ .
చంద్రబాబు విషయానికి వస్తే ఎన్నికల ప్రచారంలో చాలా వెనుకబడ్డాడు అని చెప్పవచ్చు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఖరురు చేసుకున్నా కానీ సీట్లు విషయం లో ఎటు తేల్చలేకపోతున్నాడు. బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న తరణంలో చంద్రబాబుకు తలనొప్పి వచ్చి పడింది. టీడీపీ జనసేన కూటమిలో భాగంగా బీజేపీను కూటమిలో చేర్చుకోవాలి అని చూస్తున్న, బీజేపీ అడిగిన సీట్లు ఇవ్వలేక తర్జన భర్జన పడుతున్నాడు. అమిత్ షా ను ఢిల్లీలో కలిసిన వచ్చిన తర్వాత ఇంటికే పరిమితం అయ్యాడు. ఇంకా పవన్ కళ్యాణ్ విషయంకి వస్తే వారాహి అంటూ నాలుగు రోజులు హడావిడి చేసి మూలన పెట్టి నాలుగు నెలలు కావొస్తోంది. ఈ 4 రోజులు గోదావరి జిల్లాల పర్యటన పెట్టుకొని ఒక కుంటి సాకు చెప్పి భీమవరం పోకుండా పార్టీ ఆఫీస్ లోనే తూతూ మంత్రంగా మీటింగ్ లు పెట్టుకుంటున్నాడు. చంద్రబాబు అరెస్ట్ అయినా సమయంలో ప్రైవేట్ ప్లేన్ కు పర్మిషన్ లేదు అని రోడ్ పైన వచ్చిన పవన్ కళ్యాణ్ నేడు 2 గంటలు ప్రజల కోసం కార్లో ప్రయాణం చేయలేకపోయాడు. అసలు విషయం కు వస్తే పొత్తు , సీట్లు ఖరారు కాకపోవడంతో ఎక్కడ పోటీ చేస్తాం అని సమాధానం చెప్పలేక భయపడి పార్టీ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. గ్రౌండ్ విషయానికి వస్తే సీట్లు విషయంలో అటు టీడీపీ ఇటు జనసేన సీట్ తమది అంటే తమది అంటూ బహిర్గంగానే గొడవలు పడుతున్నారు, ఈ పొత్తు ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి మరి