రైతన్నలకు మేలు చేసుకురుస్తున్న సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఇండిగ్యాప్ ..
గతంలో రైతులు సాధారణంగా తాము పండించిన పంటలను స్థానిక మార్కెట్లలో లేదా దళారి వ్యవస్థకు అమ్మేసి దళారి ఇచ్చిన సొమ్మును తీసుకొనే వాళ్ళు కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ప్రయోగాత్మకంగా చేపట్టిన గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ లో భాగంగా రైతులు తాము పండించిన పంటలకు ప్రభుత్వం ఇండిగాప్ సర్టిఫికెట్ ఇస్తుంది. ఆలా రైతులు పండించిన పంటలు ఎగుమతులు లక్ష్యంగా పని చేస్తోంది. ప్రభుత్వం చెప్పిన పంటను రైతులు పండించడం, దాని తర్వాత వచ్చే పంటకు ప్రభుత్వం ఇండిగ్యాప్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దాని ద్వారా రైతులకు ఎక్కువ డబ్బు సమకూరుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వరి, రాగి, కొర్ర, వేరు శెనగ పండించే రైతులకు ప్రభుత్వం రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ సంస్థ ద్వారా అందిస్తున్న సర్టిఫికేట్ ఉన్న వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో అత్యధిక ధర లభించటమే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఏపీ బ్రాండ్ కు ఉన్న రేటింగ్ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల నుంచి అరటి గల్ఫ్, ఆసియా దేశాలకు ఎగుమతి అవుతుండగా జీఏపీ ఉన్న పంటలకు అత్యధిక డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. జీఏపీ సర్టిఫికెట్ పొందేందుకు పాటించాల్సిన పద్ధతులు, ప్రమాణాలతో పాటు సర్టిఫి కేషన్ పొందిన ఉత్పత్తులను ఏ విధంగా ఎగుమతి చేయాలనే అంశాలపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించనున్నారు. ఈ మేరకు ఇండి గ్యాప్ (ఇండ్ జీఏపీ) సర్టిఫికేషన్ కమిటీ కూడా ఏర్పడింది.
ఇండిగ్యాప్ సర్టిఫకేషన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతి జిల్లాల్లో ప్రత్యేకంగా రెండు పొలంబడి కార్యక్రమాలు నిర్వహించిన వ్యవసాయ శాస్త్రవేత్త తో రైతులకు ప్రభుత్వం శిక్షణ ఇప్పించింది. 2023లో మొదటగా ఖరీఫ్ సీజన్లో ఈ పద్దతిని ప్రారంభించారు. మొదటిగా ప్రయోగాత్మకంగా 990 ఎకరాలలో 662 మంది రైతులు ద్వారా పంటను సాగు చేసారు . ఈ బ్రాండింగ్ , సర్టిఫికేషన్ రావాలి అంటే కొన్ని పద్దతలు అవలంబించాలి దాని కోసం ప్రభుత్వం 2024 ఖరీఫ్ సీజీన్ 26 జిల్లాలును 26 క్లస్టర్లుగా ఏర్పాటు చేసి జిల్లాకు 100 మంది రైతులకి శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది . 2023 ఖరీఫ్ లో భాగంగా 662 మంది రైతు 990 ఎకరాలలో వివిధ రకాల పంటలు వేసి వాటికీ అధిక దిగుబడి సాధించారు.
నంద్యాల జిల్లాలో 49 మంది రైతులు 62 ఎకరాల విస్తీర్ణంలో కొర్రలు పండిస్తే 252 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది.. స్థానికంగా కొర్రల ధరల క్వింటా రూ 2500గా ఉంటే ఇండి సర్టిఫికేషన్ ఉన్న కొర్రలకు మార్కెట్లో క్వింటా ధర రూ 6500 పలికింది. అన్నమయ్య జిల్లాలో 44 మంది రైతులు 95 ఎకరాల్లో వేరుశెనగ పండిస్తే వచ్చింది. వేరు శెనగకు స్థానిక మార్కెట్లో క్వింటా ధర రూ 6377గా ఉంటే ఇండిగ్యాప్ సర్టి ఫికేషన్ ఉన్న వేరుశెనగ ధర రూ 8300 పలికింది. సాధారణ పంట కన్నా ఇండి గ్యాప్ ధృవీకరణ ఉన్న పంటపై రైతులకు అదనంగా రూ 8.85 లక్షల ఆదాయం లభించినట్టు అంచనా. వైఎస్ఆర్ జిల్లాలో 37 ఎకరాల్లో వరి పండించిన వరిపై రైతులు అదనంగా రూ 8.81 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 ఎకరాల్లో పండించిన వరిపై రూ 1.42 లక్షలు పొందగలిగారు. అల్లూరి సీతా రామరాజు జిల్లాలో 22 ఎకరాల్లో పండించిన రాగుల ధర కూడా స్థానిక మార్కెట్లో రూ 3846గా ఉంటే ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ ఉన్న పంటలకు రూ 5 వేల ధర వస్తున్నట్టు అంచనా. 2023 ఖరీఫ్ లో ప్రారంభిం చిన ప్రయోగం విజయవంతం కావటంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అత్యధిక విస్తీర్ణంలో ఇండి గ్యాప్ సర్టిఫికేషన్ విధానాన్ని అమలు చేసి రైతన్నలకు మేలు చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.