జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేనాని బుధవారం భీమవరంలో నాయకులతో సమావేశానికి కావాల్సి ఉంది. అయితే నేతలు ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగడానికి అనుమతి అడిగారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సేనాని బుధవారం భీమవరంలో నాయకులతో సమావేశానికి కావాల్సి ఉంది. అయితే నేతలు ఇళ్ల మధ్య హెలికాప్టర్ దిగడానికి అనుమతి అడిగారు. దీనికి అధికారులు ఒప్పుకోలేదు. దీంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత ఏవో కారణాలతో ఉభయ గోదావరి జిల్లాల పర్యటన మొత్తాన్ని రద్దు చేసుకున్నారని సమాచారం. ప్రభుత్వమే దీనికి కారణమని అర్థం లేకుండా అటు తెలుగుదేశం, ఇటు జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి ఇస్తే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ఈ విషయం నాయకులకు తెలుసు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద వేస్తున్నారు.
హెలికాప్టర్ ల్యాండింగ్కి అనుమతించకపోవడంతో పవన్ భీమవరం పర్యటన వాయిదా పడిందని జనసేన ఉపాధ్యక్షుడు బి.మహేందర్రెడ్డి అన్నారు. ఆర్అండ్బీ శాఖ మోకాలడ్డిందని ఆయన చెప్పారు. దూరంగా ఉన్న టవర్ను సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతోందన్నారు. అమలాపురంలోనూ ఆర్అండ్బీ అధికారులతో అనుమతుల విషయంలో మెలికలు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. అసలు దీనికి అధికార పార్టీకి సంబంధం ఏమిటో సేన నేతలే చెప్పాలి. ఓ వైపు అధికారులు ఇళ్ల మధ్య ల్యాండింగ్ వద్దని స్పష్టంగా చెబుతున్నా టీడీసీ, సేన నేతలు దీనికి రాజకీయ రంగు పుశారు.
పవన్ కళ్యాణ్ తీరుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైరయ్యారు. •హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడా అని ప్రశ్నించారు. •ఇళ్ల మధ్య ల్యాండింగ్కు అధికారులు ఒప్పుకోకపోవడంతో పర్యటనను వాయిదా వేసుకున్నాడు.• జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు నాటనానికి తెరలేపి హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడని విమర్శించారు. •మంగళగిరి నుంచి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది. లేకపోతే ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్లొచ్చు. కానీ• హెలికాప్టర్ కోసమే పర్యటన వాయిదా వేసుకోవడంపై భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి. ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడని గమనించుకోవాన్నారు. పవన్కు చంద్రబాబు డబ్బు కూరుస్తున్నారు. హెలికాప్టర్ ఇచ్చి పర్యటనలు చేయాలని ఆదేశించారు. జనంపై ప్రేమ ఎక్కువై సేనాని బయటికి రాలేదని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది.