మహీ.వి.రాఘవ కు హార్స్లీహిల్స్లో రెండెకరాల స్థలం కేటాయింపు విషయంలో మీడియాలో అనవసర రాద్ధాంతం జరుగుతుంది. ఒక మినీ స్టూడియో కట్టుకోవడం కోసం అతనికి ప్రభుత్వం రెండెకరాల స్థలం కేటాయించింది. వెంటనే మీడియాలో ఈ విషయమై విపరీతమైన నెగెటివిటీ ప్రసారం చేసారు ?? ఎందుకు ??
అతనికి ఇచ్చిన రెండెకరాల స్థలం ఏమీ రామోజీ / రామానాయుడు స్టూడియోలలా వందల ఎకరాల్లో లేదు. పోనీ రాజధాని ప్రాంతంలోనో, రాజధాని రాబోవు ప్రాంతంలోనో ఇచ్చేసి విలువైన భూమిని ధారాదత్తం చేసారా అంటే అదీ కాదు. మరి ఎందుకు ఈ రాద్ధాంతం?? ఎందుకంటే అతను వైయస్ గురించి, జగన్ గురించి రెండు సినిమాలు తీసాడు. ఆ మాత్రం చాలు అతనిపై బురద చల్లడానికి.
ఇదే విషయమై మహీ కూడా తీవ్రంగా స్పందించారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగాననీ, అక్కడే చదువుకున్నానీ.. అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతోనే ముందుకెళ్తున్నాననీ,నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నానీరచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటూ, సొంతంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించాననీ, సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఇష్టపడకపోయినా, నా ప్రాజెక్ట్స్ రాయలసీమలోనే చిత్రీకరించానీ తెలిపారు.
ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది అనే మూడు ప్రాజెక్ట్స్ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించారు. వాటి కోసం దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు చేశారు. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదనీ, కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకుంటున్నాననీ,
రాయలసీమకు ఎవరైనా మీరు చేయరు… చేసేవాడిని చెయ్యనియ్యరు అంటూ ఓ వర్గం మీడియాపై విమర్శలు చేసారు.
వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడో ఇచ్చింది కదా ? వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు ?నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మహి వి.రాఘవ్ ప్రశ్నించారు .