చంద్రబాబు దగ్గర శిష్యరికం చేసిన ఎవరికీ ఆయనకున్నంతటి విజనరీ అబ్బలేదు అని అనుకునే సమయానికి దరిమిలా రేవంత్రెడ్డి సీయం అవడం, అయ్యాక ఆయనిస్తున్న స్టేట్మెంట్స్ చూడటంతో రాజకీయ జనానికి చాలా క్లారిటీ వచ్చింది. సేం టు సేం గురువులానే రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారు.
సీయం సీటు అందుకున్న రెండో రోజే గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ ముందుంచి ఇక మేం చేయగలం అని చెప్పినప్పుడే రేవంత్ తాను చంద్రబాబు అడుగుజాడల్లోనే నడవబోతున్నానన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి అచ్చం గురువులానే అరచేతిలో స్వర్గం చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అందులో భాగంగా, మొదటిది మూసీ నందిని థేమ్స్ నదిలా మారుస్తాను అనడం. చంద్రబాబు కూడా ఇలానే అమరావతిని ముందుకు తెచ్చి ఫోటోషాప్ డిజైనింగ్ కుర్రాళ్లతో రకరకాల దేశాల పేర్లు తగిలించి అయిదేళ్ళు పాటు పాంప్లేటు పత్రికల్లో ప్రింటేయించుకున్నాడు. సింగపూర్, జపాన్, మలేషియా, ఆఫ్ఘనిస్తాన్ ఇలా ప్రపంచ పటంలో ఉన్న అన్ని దేశాల పేర్లనూ వాడేసాడు. అప్పటికింకా నిత్యానంద “కైలాస” దేశం పెట్టలేదు కానీ, లేదంటే అది కూడా వాడి ఉండేవాడే.
ఇపుడు, ఆయన దారిలోనే రేవంత్ హైదరాబాద్ సిటీ మీద పడ్డారు. తరాలుగా మూసీ నదిని బాగు చేయడం కాదు కదా, కనీసం అందులోకి వెళ్ళే నాలాలను కూడా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఇపుడు ఈయన సడెన్గా థేమ్స్ నదీ, సింగపూర్ వీధి అంటే హైదరాబాద్ జనాలు ఏమైపోతారో మరి!!