ఆంధ్రప్రదేశ్లో వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీ కేంద్ర వైద్య సేవల క్వాలిటీ అభివృద్ధి పరిశీలన బృందం అభిప్రాయపడింది. ఇక్కడి వైఎస్సార్ హెల్త్ క్లినిక్లు అత్యవసర సేవలు అందించడంలో బాగా పనిచేస్తున్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయని కితాబిచ్చింది. బృందంలో సభ్యులుగా ఉన్న డాక్టర్లు రోనఖ్శర్మ, పవేన్ థాన్ చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలోని పరికిదొనలో శుక్రవారం పర్యటించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హెల్త్ క్లినిక్ను పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ల్యాబ్ పరీక్షలు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాధిగ్రస్తులకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. స్వయంగా రోగులతో మాట్లాడి వైద్యం ఎలా అందుతోందని ఆరాతీశారు. వారు చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పారు. పరిశుభ్రతను చూసి మెచ్చుకున్నారు.
ఇవేమీ పచ్చ మీడియాకు కనిపించవు. ఎంత సేపటికీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై పడి ఏడవడమే వాటికి తెలిసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్య రంగంలో ఎన్నో మార్పులు తెచ్చారు. పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. దీంతోనే కేంద్రం నుంచి వచ్చే ప్రతి బృందం ప్రశంసల జల్లు కురిస్తోంది.