సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఆలోచనలతో ప్రచారంలో దూసుకెళ్తోంది. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ముందుపెట్టి ఓట్లు అడుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి కూడా ఒంటరిగా పోటీ చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పొత్తులతో వస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీ ‘మార్పు ఒక పదం మాత్రమే కాదు. మార్పు అంటే మాటివ్వడం. అందుకే ప్రజలు ఎన్నుకునేది జగన్నే’ అనే నినాదాన్ని తెచ్చింది.
వైఎస్సార్సీపీ కొత్తగా ప్రారంభించిన క్యాంపెయినింగ్ ఇలా ఉంది. జగన్ ఉంటే చాలా బాగుంటుంది అందరి లైఫ్.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం నెరవేర్చారు.
– జగన్ ఉంటే విద్యార్థుల భవిష్యత్ సూపర్. రూ.16,000 కోట్లతో మన బడి నాడు – నేడు కింద పాఠశాలలో సదుపాయలు కల్పించారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చారు.
– జగన్ అంటే రైతులను ఆదుకునే వ్యక్తి. వ్యవసాయ రంగంలో ఏపీ 8.2 శాతం వృద్ధిని సాధించింది. రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిచారు.
– జగన్ వల్లే అవుతుంది డెవలప్మెంట్. 2019 నుంచి ఇప్పటి వరకు 127 పెద్ద పరిశ్రమలు వచ్చాయి. రూ.67,000 కోట్ల పెట్టుబడులతో 85,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి.
– జగన్ అంటే ప్రజల ఆరోగ్యానికి ఫస్ట్ స్టెప్. రూ.8,000 కోట్లతో 3,257 మెడికల్ ప్రొసీజర్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించారు. గత ప్రభుత్వ బకాయిలను కట్టారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
–జగన్ ఉంటే అవుతుంది అక్కచెల్లెళ్ల బిజినెస్ డబుల్ అప్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో 75 శాతం మహిళల కోసమే. ఆర్థిక భరోసా కల్పించడంతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందింది.
జగన్ ఇలా పాజిటివ్ ప్రచారాన్ని నమ్ముకుంటే.. తెలుగుదేశం అండ్ కో ఫేక్ ప్రచారానే అస్త్రంగా చేసుకుంది. బాబు ఇప్పటికీ తాను సీఎంగా ఉన్నప్పుడు చేసిన మంచిని చూపించి ఓట్లు అడగలేని పరిస్థితి. కుటుంబాలను విడగొట్టి రాజకీయాలు చేస్తున్న ఘనుడు ఆయన. జనసేన, బీజేపీ లేకపోతే తాను మనుగడ సాధించలేడని వారి చుట్టూ తిరుగుతున్న 40 ఇండస్ట్రి, నేను చెప్పింది చేశాను కాబట్టే.. ధైర్యంగా ఉన్నానంటున్నారు జగన్.