తేజ సజ్జా మరో సూపర్ హీరో కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే హనుమాన్ లో సూపర్ హీరోగా నటించి కలెక్షన్స్ కొల్లగొట్టిన తేజ సజ్జా మరోసారి అలాంటి సూపర్ హీరో కథనే ఎంచుకోవడం విశేషం. తాజాగా నేడు మూవీ మేకర్స్ ‘మిరాయ్’ చిత్ర గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
‘అనగనగా ఓ సామ్రాట్ అశోక్.. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపంతో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం.. అదే మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం.. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం.. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం.. ఇది తరాలుగా తప్పని ఓ మహారణం.. అంటూ సాగే మూవీ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని చాలా గ్రాండ్ గా తీస్తున్నట్లు మూవీ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతుంది.
కాగా ఇప్పటికే హనుమాన్ సూపర్ హీరో కథతో 300 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన తేజ సజ్జా మరోసారి సూపర్ హీరోగా వస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఏర్పడుతున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న మిరాయ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. కాగా కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈగల్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే నిర్మించడం గమనార్హం. ఆ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నా మూవీ మాత్రం ప్లాప్ గా నిలిచింది. కానీ మరోసారి కార్తీక్ ఘట్టమనేనికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అవకాశం ఇవ్వడం గమనార్హం. మిరాయ్ సినిమాలో రితిక నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. కథ ప్రకారం విలన్ పవర్ ఫుల్గా ఉండాలని అందుకే మంచు మనోజ్ ని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు.