బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండస్త్రీలోను సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే మరోసారి టాలీవుడ్ ఇండస్త్రీపై సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన రాధికా ఒక చానల్ కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
రాధికా ఆప్టే మాట్లాడుతూ తాను ఎక్కువగా కష్టపడిన పరిశ్రమ టాలీవుడ్ అని. దానికి కారణం ఆ పరిశ్రమలో భరించలేని విధంగా పురుషాధిక్యత ఉంటుందని. టాలీవుడ్ పరిశ్రమలో మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరు అసహనంగా ఉంటుందని. మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండదని. సెట్ లో మూడో వ్యక్తిగా దారుణంగా ట్రీట్ చేస్తారని. ఈ కారణాల చేత తాను చాలాసార్లు ఇబ్బందులు పడినట్టు. ఏం చెప్పకుండానే ఇష్టమొచ్చినట్లు షూట్ క్యాన్సిల్ చేస్తారని. అక్కడ నా అవసరం కొంతవరకే అని గ్రహించాను కాబట్టే ఇక అటువైపు చూడటంలేదని చెప్పుకొచ్చింది.
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో ఒక హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే గతంలోను టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా చలామణీ అయ్యే వ్యక్తి తనపై అసభ్యంగా ప్రవర్తించిన తీరును కూడా నిర్భయంగా చెప్పి వార్తల్లోకి ఎక్కారు. దీంతో రాధికా మాట్లాడింది బాలయ్యను ఉద్ధేశించేనని సోషల్ మీడీయాలో నెటిజన్లు వైరల్ చేశారు. దీనికి కారణం ఆమె టాలీవుడ్ లో అగ్రహీరో తో నటించిన సినిమాలు లెజెండ్, లయన్ కావడం ఆ సినిమాలో కధానాయకుడు పాత్ర బాలయ్య పోషించడం. ఆ తరువాత నుండే ఆమే టాలీవుడ్ పరిశ్రమలో కనిపించకపోవడంతో వారి వాదనలకు బలం చేకూరుతుంది.