సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ తారలు, బుల్లితెర నటులు, మోడల్స్ పాల్గొన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ పార్టీలో పాల్గొన్న ప్రముఖుల్లో తెలుగు నటి హేమ ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని అలాంటి రూమర్లను నమ్మవద్దని హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు.
మరోవైపు బెంగళూరు పోలీసులు మాత్రం హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని స్పష్టం చేయడంతో పాటు ఆమె ఫోటోను కూడా విడుదల చేయడం, ఆ ఫొటోలో హేమ రిలీజ్ చేసిన వీడియోలో ఉన్న డ్రెస్ తోనే ఉండడంతో ఆమె రేవ్ పార్టీలో పాల్గొన్నారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దాంతో హేమ ఈసారి బిర్యానీ వండుతూ వీడియో రిలీజ్ చేసి తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హేమ వేసిన కవర్ డ్రైవ్ లకు తెరపడింది. ఆమె రక్త నమూనాలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు నార్కోటిక్స్ బృందం గుర్తించడంతో ఆమె నాటకాలకు తెరపడింది.
కాగా రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరించగా 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నార్కోటిక్ టీమ్ నిర్ధారించింది. ఇందులో 57 మంది పురుషులు, 27 మంది మహిళలు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. మరోవైపు హేమ తన పేరును మార్చుకుని కృష్ణవేణి పేరుతో రేవ్ పార్టీకి అటెండ్ అయినట్లు సమాచారం. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్దారించడంతో సోషల్ మీడియాలో ఆమె వండిన బిర్యానీ వేస్ట్ అయిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.