పేదింటి ఆడపిల్లల పెళ్లికి జగనన్న ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు ‘వైఎస్సార్ కళ్యాణమస్తు’ ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు ‘వైఎస్సార్ షాదీ తోఫా’ ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ఈ పథకాల్లో భాగంగా అర్హులైన 10,132 జంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
గత సంవత్సరం అక్టోబర్ – డిసెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద రూ.78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. తద్వారా నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 56,194 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జగన్ సర్కారు రూ.427.27 కోట్లు జమ చేసింది. పేదింటి ఆడ పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న లక్ష్యంతో ఈ పథకానికి కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలని నిబంధన పెట్టడం గమనార్హం. బాల్య వివాహాలను నిరోధించడానికి వధువు కనీస వయసు 18గా నిర్ణయించారు. క్రమం తప్పకుండ ప్రతీ త్రైమాసికంలో సీఎం జగన్ వైఎస్సార్ కళ్యాణమస్తు వైఎస్సార్ షాదీ తోఫా ప్రోత్సాహకాలు అందిస్తుండగా చంద్రబాబు పాలనలో 17,709 మంది అర్హులకు రూ.68.68 కోట్లను ఎగ్గొట్టడం గమనార్హం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు చంద్రబాబు పాలనతో పోలిస్తే రెట్టింపు సాయాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తుండడం విశేషం. ఎస్సీలకు గత ప్రభుత్వం సాయం రూ.40 వేలు కాగా ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అందిస్తున్న సాయం రూ.1,00,000 కావడం గమనార్హం. ఎస్సీల్లో కులాంతర వివాహానికి చంద్రబాబు ప్రభుత్వ సాయం రూ.75 వేలు కాగా, ప్రస్తుతం సీఎం జగన్ రూ.1,20,000 అందిస్తున్నారు. అదేవిధంగా ఎస్టీలకు గత ప్రభుత్వ సాయం రూ.50 వేలు కాగా, సీఎం జగన్ రూ.1,00,000 అందిస్తున్నారు. ఎస్టీ కులాంతర వివాహాలకు గత ప్రభుత్వ సాయం రూ.75 వేలే కాగా, సీఎం జగన్ రూ.1,20,000 అందిస్తున్నారు. బీసీలకు గత ప్రభుత్వం రూ.35 వేలు సాయంగా అందించగా సీఎం జగన్ రూ.50,000 అందిస్తున్నారు. బీసీల కులాంతర వివాహానికి గత ప్రభుత్వ సాయం రూ.50 వేలు కాగా, ఇప్పుడు సీఎం జగన్ మరో 25000 పెంచి రూ. 75,000 అందిస్తున్నారు.
మైనార్టీలు, దూదేకులు, నూర్ బాషాల పిల్లల వివాహాలకు గత ప్రభుత్వం అందించిన సాయం రూ.50 వేలు కాగా ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ దానిని రూ.1,00,000కు పెంచి అందిస్తున్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వ సాయం రూ.20,000 కి పరిమితం కాగా , సీఎం జగన్ దాన్ని రెట్టింపు చేసి రూ.40,000 అందిస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులకు గత ప్రభుత్వ సాయం రూ.1,00,000 కాగా, సీఎం జగన్ మాత్రం రూ.1,50,000 అందించడం గమనార్హం.