ఎమ్మెల్సీ అనర్హత పిటిషన్ పై శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్సీలు రామచంద్ర రావు, వంశీ యాదవ్ ల మంగళవారం విచారణ జరిపారు. రెబెల్ ఎమ్మెల్సీల భవిష్యత్తు మండలి చైర్మన్ కోయ్యే మోషేన్ రాజు చేతిలో ఉంది. ఇప్పటికే రెండు సార్లు విచారణకు రమ్మని కోరగా ఇద్దరు విచారణకు హాజరుకాలేదు. ఎట్టకేలకు నిన్న ఇద్దరు ఎమ్మెల్సీలు రామచంద్ర రావు, వంశీ యాదవ్ లు విచారణకు హాజరు అయ్యారు. కాగా రెబల్ ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని మండలి చైర్మన్ కి వైసీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మెరుగు మురళీలు మండలిలో ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీల ఫిర్యాదు మేరకు రెబెల్ ఎమ్మెల్సీలైన వంశీకృష్ణ యాదవ్, రామచంద్ర రావుకి మూడుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హాజరు కాలేదు. ఇదే చివరి నోటీసుగా భావించాలని చైర్మన్ తెలియజేయడంతో ఎట్టకేలకు హాజరయ్యి తమ వివరణను ఇచ్చుకున్నారు. ఇప్పటికే మండల్ చైర్మన్ వీరిపై అనర్హత వేటుకు సంబంధించి న్యాయ నిపుణుల సలహా తీసుకున్నట్లు సమాచారం.
గత వారంలోనే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధికార వైకాపా కి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు విపక్ష టిడిపిలకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేల పై అనర్హత వేటు వేయడం జరిగింది. అసెంబ్లీలో స్పీకర్ రెబెల్ ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయం లాగే, మండలిలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారా లేదా అని వేచి చూడాలి. రెబెల్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడమే సరైన నిర్ణయం అని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.