వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా రిలీజుకు అడ్డంకులు తొలిగిపోయాయి.. ఈ నెల 29వ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ కానుందని ఎక్స్ లో వెల్లడించిన ఆర్జీవి, వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ ఇచ్చిందని తెలిపారు.
కాగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న వ్యూహంలో అజ్మల్ , మానస జంటగా నటించారు. సమకాలీన రాజకీయ అంశాలతో సినిమా రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. దాంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యూహం సినిమాకు అనుమతి ఇవ్వకూడదని సెన్సార్ బోర్డుకు లేఖ రాయడం సంచలనం కలిగించింది. సినిమా విడుదల ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎవరూ ఆపలేరని వ్యూహం విడుదలను కూడా ఆపలేరని ఎక్స్ లో చెప్పిన ఆయన తాజాగా సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను ఎక్స్ లో పోస్ట్ చేసి బ్యాడ్ న్యూస్ ఫర్ బ్యాడ్ గయ్స్ అని పోస్ట్ చేసారు.