రాష్ట్రంలో వివిధ శాఖలలో ఉన్న 33 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు విడుదల చేసారు. టౌన్ ప్లానింగ్, మెడికల్, ట్రైబల్ వెల్ఫేర్, భూగర్భ జలాలు వంటి వివిధ శాఖల్లో ఉద్యోగాలు పడ్డాయి.
వాటిని భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏపీపీఎస్సీ శక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులోని గ్రేడ్ 2 ఉన్న 18 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అసక్తి కలిగిన వారు మార్చి 19 నుంచి ఏప్రిల్ 8వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏపీ టౌన్ ప్లానింగ్లో అసిస్టెంట్ డైరెక్టర్ 7 ఖాళీలకు గాను మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్లో లైబ్రెరియన్ 4 ఖాళీలకు గాను మార్చి 27 నుంచి ఏప్రిల్ 16వ తేదీ లోగా, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ 1 పోస్టుకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 16వ తేదీలోగా, విభిన్న ప్రతిభావంతుల శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న 2 ఖాళీలకు మార్చి 1 నుంచి ఏప్రిల్ 21వ తేదీలోగా, భూగర్భ జలాలు సర్వీస్లో అసిస్టెంట్ కెమిస్ట్ గా ఉన్న 1 పోస్టుకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 24వ తేదీ లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిపికేషన్లో పేర్కొన్నారు.
ఇవేకాక, గ్రూప్ 2 సర్వీసెస్లో స్పోర్ట్స్ కోటాలో ఎంపికయిన అభ్యర్థుల జాభితాను ఏపీపీఎస్సీ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. వారి ఉద్యోగ కేటాయింపుపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది.