రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలలో విజయ లక్ష్యంతో ముందుకు వెళుతున్న తరుణంలో ఆ టార్గెట్ 175 కౌంట్ ను విజయవాడ తూర్పు నుంచి ప్రారంభిద్దామని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరిగిన విజయవాడ తూర్పు ఇన్చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన మేము సిద్ధం మా బూత్ సిద్ధం సభకు ముఖ్యఅతిథిగా వైఎస్ఆర్సిపి రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు.
అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కన్నా విజయవాడ తూర్పులో ఎక్కువ అభివృద్ధి జరిగిందని తెలిపారు. 2019 ఎన్నికలలో విజయవాడ తూర్పు సీటు వైఎస్ఆర్సిపి గెలవక పోయిన సీఎం జగన్ తారతమ్యాలు లేకుండా విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు ఎవరు ఊహించనంత అభివృద్ధి జరిగిందని, తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడొచ్చినా ఒక పండగ వాతావరణంలా ఉంటుందన్నారు.
ఇదే సభలో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఇన్చార్జిగా దేవినేని అవినాష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి విశ్రాంతి లేకుండా కష్టపడ్డాడు. అన్ని వర్గాల ప్రజలు నుంచి ప్రేమ, అభిమానాలు సంపాదించుకున్నారు. అవినాష్ మార్క్ నియోజవర్గంపై కనపడుతోంది. ఎన్నో ఏళ్ల కృష్ణలంక వాసుల కల రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా దేవినేని అవినాష్ ఆధ్వర్యంలోనే జరిగింది. అక్కడ వాకింగ్ ట్రాక్ పవర్ నిర్మాణం కూడా అద్భుతంగా చేస్తుందని, తూర్పు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పరిచిన దేవినేని అవినాష్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలని కోరారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో గతంలో ఎన్నడు జరగని అభివృద్ధిని తాను చేశానని, కృష్ణలంక ప్రజల చిరకాల కోరికయిన రిటైనింగ్ వాల్ ను 350 కోట్లతో జగన్ ప్రభుత్వం కట్టిందని వెల్లడించారు. కృష్ణలంక రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా 60000 మంది ప్రజల కష్టాలని తీర్చిందని రివర్ ఫ్రంట్ పేరుతో కృష్ణా నది తీరాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి అందాలతో అత్యంత సుందరంగా రిటైనింగ్ వాల్ వెంబడి పరిసరాలను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్లిన కొత్తగా వేసిన రోడ్లు మిల మిల మెరుస్తూ కనిపిస్తున్నాయని వీటి కోసం ప్రభుత్వం 150 కోట్ల వరకు ఖర్చు చేసిందని, బెంజ్ సర్కిల్ లో రెండో ఫ్లైఓవర్ మొదలు పెట్టి పూర్తి చేసిన ఘనత జగన్ కే దక్కుతుందని, నాడు నేడులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు 20 కోట్లు, ప్రభుత్వాసుపత్రి నాడు-నేడులో భాగంగా 170 కోట్ల ఖర్చుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మించాం, 20 కోట్లతో మూడు విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, మూడు రైతు బజార్లో అందుబాటులోకి తెచ్చాం ఇవి కాకుండా సంక్షేమ పథకాల ద్వారా 900 కోట్లను డైరెక్ట్ గా మహిళల బ్యాంక్ ఖాతాలో డబ్బును జమ చేశామని వెల్లడించారు. వీటితో పాటు 32211 మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చాం. గతంలో ఐదేళ్లు టీడీపీ పాలనలో అభివృద్ధి చెప్పుకోవడానికి ఏమి లేదని నియోజకవర్గంలో ప్రతి గడపకు మూడు సార్లు వెళ్ళాం, ప్రతి కార్యకర్త బాధ్యతగా నాతోపాటు తిరిగారు. కార్యకర్తలే నా బలం వారి సంతోషమే నా సంతోషమని దేవినేని అవినాష్ అన్నారు.