షర్మిళ గారు తాను పెట్టిన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపధ్యంలో తెలుగు తముళ్ళు, వారిని మోస్తున్న జనసేన కార్యకర్తలు ఇదేదో ప్రపంచంలో ఎక్కడా జరగని వింత మాదిరి. ఒక్క జగన్ గారి కుటుంభంలోనే జరుగుతున్న తంతుగా చూపే ప్రయత్నం చేస్తూ ఇదేదో జగన్ గారికి నష్టం చేకూర్చుతుంది అన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
ఒకే కుటుంభంలో రక్తం పంచుకుని పుట్టిన వారు వేరు వేరు పార్టీల్లో ప్రతినిధులుగా ఉండటం తెలుగునాట ఇదేం కొత్తకాదు. అలాగే ఇదే చివరిది కూడా కాకపోవచ్చు. గతంలో కూడా తెలుగుదేశం అధినేతగా ఉన్న చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామూర్తి నాయుడు చంద్రబాబుతో తీవ్రంగా విభేదింది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నాడు ఆయన కాంగ్రెస్ లో చేరుతూ కాంగ్రెస్ పార్టీ అదేశిస్తే చంద్రబాబుపై కూడా పోటీ చేయడానికి వెనకాడని ప్రకటనలు ఇచ్చారు. సొంత అన్న చంద్రబాబు నాయుడిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. ఇంకో అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు దగాకోరు నమ్మిన వారిని మోసం చేయడం ఆయనకి వెన్నతో పెట్టిన విధ్య అంటూ నారా రామ్మూర్తి నాయుడు చంద్రబాబుని తీవ్రంగా విమర్శించారు.
అలాగే ఎన్టీఆర్ తనయుడు, చంద్రబాబు భావమరిది హరికృష్ణ తొలుత తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి సహకరించిన్నా తర్వాత బాబుతో విభేదించి “అన్న టీడీపీ” పార్టీని స్థాపించి చంద్రబాబుపై తీవమైన విమర్శలు చేశారు, మరో పక్క తోడల్లుడు దగ్గుబాటి సైతం చంద్రబాబుతో విభేదించి పార్టీలు మారారు. ఇలా ఒక్క చంద్రబాబు తమ్ముడు , భావమరిది, తోడల్లుడు ఆయనను విభేదించి బయటికి వచ్చారు.
మరో పక్క ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీని సైతం చిరంజీవిగారు కాంగ్రెస్ లో విలీనం చేసి ఆ కాంగ్రెస్ లో పదవులు పొందారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చిరంజీవి వెంట నడవకుండా కొత్త పార్టీ పెటుకున్నారు. దీంతో ఆ కుటుంభంలో సైతం అన్న ఒక పార్టీలో ఉంటే చిరంజీవి తముళ్ళైన నాగబాబు, పవన్ కళ్యాణ్ మరొక పార్టీకి ప్రతినిదులుగా ఉన్నారు.
ఇన్ని వైరుద్యాలు తమ దగ్గరుంచుకొన్న బాబు అండ్ కో, గురివింద సామెతగా తమ నలుపు చూసుకోకుండా షర్మిల గారి పార్టీ ప్రస్తానాన్ని చూపుతూ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వేరే పార్టీల్లో చేరుతున్నారు అంటూ ఆరోపించడం విచిత్రం.