టీటీడీ ఉద్యోగులకు శుభవార్త తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. రెండు నెలల క్రితం టిటిడి ఉద్యోగస్తులకు ఇళ్లపట్టాలని మంజూరు చేశారు అంతలోనే మరో తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను 2014 జనవరి 1వ తేదీకి ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో విడుదల చేసింది. ఈ జీవోని పరిగణనలోకి తీసుకొని టీటీడీ కూడా తమ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు పాలకమండలి తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగులకు మేలు జరుగుతుంది.
పాలకమండలి సమావేశం తర్వాత టిటిడి పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సిమ్స్ ఆస్పత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్స్ పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపిందని, టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాటులకు నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది, 1.88 కోట్ల రూపాయలతో పిఎసి అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిఫ్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ 1.50 కోట్లతో ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటుకు, 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి పాలకమండలి ఆమోదం తెలిపిందని తెలిపారు.
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి ,పార్థసారథి స్వామి ,కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగార ఆభరణాల బంగారు పూతకు ఆమోదించారు. టీటీడీ ఐటీ సేవల కోసం ,టెక్ రిప్లేస్మెంట్ కోసం ఐదేళ్లపాటు నిర్వహణ కోసం 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులు చేయటానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఇటీవల ఘాట్ రోడ్లో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు నరసింహులు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు