శాంతి స్వరూప్, తెలుగు వార్తా ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు. 1983 లో దూరదర్శన్ లో చేరిన నాడు తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన నాటి నుండి ప్రతి రోజూ స్పష్టమైన ఉచ్చారణతో, అక్షర దోషం లేని పదజాలంతో వార్తలు అందించే ఆయన గొంతు వినని వారు లేరు. కాలానుగుణంగా పుట్టగొడుగుల్లా పలు ఛానెల్లు పుట్టుకొచ్చినా 2011 లో ఆయన రిటైర్డ్ అయ్యేవరకూ కేవలం ఆయన గొంతు వినడం కోసమే దూరదర్శన్ వార్తలు వినే అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
2011 లో రిటైర్ అయ్యిన ఆయన తన ఉద్యోగ కాలంలో పలు పురష్కారాలతో పాటు లైఫ్ టైం అచివ్మెంట్ అందుకొన్నారు. వ్యక్తిగత జీవితంలో కూడా పేరుకి తగ్గట్టు ప్రశాంత మైన జీవన శైలి ఆయనది. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో యశోద హాస్పిటల్ లో చేరిన ఆయన వార్తా ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేసి ఈ ఉదయం తుది శ్వాస విడిచారు.