– ప్రణీర్రావు, ప్రభాకర్రావు, భుజంగరావులపై కూడా..
బంజారాహిల్స్ (హైదరాబాద్):
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన ప్రణీర్రావు, ప్రభాకర్ రావు, భుజంగరావుతోపాటు టీవీ-5 యాంకర్ సాంబశివరావు తనను వేధింపులకు గురి చేశారని.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ వ్యాపారవేత్త, సంధ్య కన్వెన్షన్ అధినేత శరణాల శ్రీధర్రావు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు
ఈ ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ లో నివసించే శరణాల శ్రీధర్రావు పలు వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నారు
2017-18 మధ్య టీవీ-5 సాంబశివరావు.. శ్రీధర్రావు వద్దకు వచ్చి ‘మీకు వ్యాపారంలో కావాల్సిన సహాయం చేస్తా.. ఆర్థిక కష్టాల్లో ఉన్న నన్ను ఆదుకోవాలి’ అని కోరాడు.
అందుకు శ్రీధర్రావు ఒప్పుకొని సాంబశివరావు ఉంటున్న ఇంటికి సైతం నెలనెలా కిరాయి చెల్లిస్తూ వచ్చారు
అలాగే సాంబశివరావు జీవన భృతి కోసం తనకు చెందిన కమర్షియల్ ప్లాట్లలో ఒక దాన్ని పెట్రోల్ బంకు పెట్టుకోవడానికి ఇచ్చారు
అయితే సాంబశివరావు కొన్ని సెటిల్మెంట్ల వ్యవహారంపై పోలీస్ అధికారి భుజంగరావు వద్దకు శ్రీధర్రావును తీసుకువెళ్లగా ఆ వాతావరణం నచ్చక ఆయన వెనక్కి వచ్చేశారు
దీంతో వ్యాపారం ఎలా చేస్తావో చూస్తామంటూ శ్రీధర్రావును బెదిరించారు
ఆయన వ్యాపారాల్లో తలదూర్చడం, పోలీసే స్టేషన్లలో తప్పుడు ఫిర్యాదులు చేసి నమోదు చేయించడం వంటివి చేశారు. తద్వారా శ్రీధర్రావును దారికి తెచ్చుకొని ఆర్థిక లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేశారు
వ్యాపార లావాదేవీల గురించి శ్రీధర్రావు ఎవరితో మాట్లాడినా వారి ఫోన్ నంబర్లు సేకరించడం, ఆపై శ్రీధర్రావుకు, వారికి మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరించడం వంటి చర్యలకు సాంబశివరావు, భుజంగరావు పాల్పడుతూ వచ్చారు
సెల్ ఫోన్ ను ట్యాప్ చేయించి శ్రీధర్రావు ప్రతి కదలికను తెలుసుకొని తదనుగుణంగా ఆయన్ను మానసికంగా హింసించారు
ఈ వ్యవహారంలో సాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్రావు, ప్రణీత్ రావు హస్తం ఉన్న ట్లు శ్రీధర్రావు పోలీసులను ఆశ్రయించారు