జయహో జగన్
మరికొద్దిరోజుల్లో మన ప్రభుత్వమే వస్తుంది తమ్ముళ్లూ.. జగన్ నీ పనైపోయింది.. నీ కుర్చీ మడత పెట్టేస్తున్నాం.. దుష్టచతుష్టయం సభ్యులు చంద్రబాబు నాయుడు, లోకేశ్, పవన్ కళ్యాణ్ చెప్పే మాటలకు రాయలసీమ సిద్ధం సభ గట్టి సమాధానమిచ్చింది. జగన్ జనం గుండెల్లో కొలువైన రారాజు రా అని అనుకునే స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ఆదివారం సీమ దారులన్నీ కిక్కిరిశాయి. ఇసుకేస్తే రాలనంత జనంతో 250 ఎకరాల సభా ప్రాంగణం జగన్ నామస్మరణతో హోరెత్తింది. దేశంలో ఈ స్థాయిలో రాజకీయ సభను నిర్వహించాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మరోసారి నిరూపితమైంది. ‘ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లో ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఇంట్లోని సింక్లోనే ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలను ఉతికి ఆరేశారు జగన్.
ప్రజలకు మంచి పాలన అందించేందుకు మళ్లీ సిద్ధమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సభా వేదిక నుంచి ప్రకటించారు. ఆయన ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇలా ఉన్నాయి. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే ఆయన మార్క్ ఉందా?, బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం గుర్తుకొస్తుందా?, కేవలం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రాయడం, ప్రజలను మోసం చేయడమే ఆయన ఆనవాయితీ. తెలుగుదేశం పార్టీ తరఫున ఇచ్చిన మేనిఫేస్టోలో కనీసం 10 శాతమైన అమలు చేశారా?, మరోసారి అలాంటి అబద్ధాలు, మోసాలతో వస్తున్నారు. ఆరు స్కీంలతో ఎర చూపిస్తున్నాడు. చేసేది మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేప్పుడు భావదారిద్రమేందుకనేది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు, నమ్మించినవాడు దోచుకుంటాడు. ఇదే బాబు సిద్ధాంతం. బాబు వంచన భరించలేకే కదా.. ఐదేళ్ల క్రితం ప్రజలంతా చొక్క మడతేశారు. ఆయన కుర్చీని మడిచి, వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారు. మరోసారి చొక్క మడతపెట్టేందుకు సిద్ధామా.. ఆ పెద్దమనిషి చేయలని పనులన్నీ ఈ 57 నెలల పాలనలోనే చేసి చూపించారు. ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్థి మనుసులో చోటు సంపాదించుకోగలిగాం. మన ప్రభుత్వంలో పథకాలు తీసుకున్న లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికీ చెప్పాలి. మొదటి సారి ఛాన్స్ ఇస్తేనే రైతన్నకు భరోసాని ఇచ్చాం. పగటి పూటే విద్యుత్ అందుబాటులోకి తీసుకువచ్చాం. గతంలో చంద్రబాబు రూ.87 వేల కోట్ల రుణమాఫీని చేయకుండా మోసం చేశాడు. అక్కచెల్లమ్మలకు అమ్మఒడి, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వారంతా ప్రతి ఇంటికీ వెళ్లి మీ జగనన్న ప్రభుత్వంతో జరిగిన మంచి చెప్పాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు మొట్టమొదటి సారి ఇంగ్లిష్ మీడియం ఇచ్చాం. డిజిటల్ క్లాసులు, ఐబీ సిలబస్ తెచ్చాం. అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టాం. ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి, ఇవన్ని కొనసాగాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయడమంటే మన పిల్లల్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడమే. సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే, ఇంగ్లిష్ మీడియంను రద్దు చేయడమే అని చెప్పండి. అవ్వాతాతలకు, అక్కచెల్లమ్మలకు రూ.3,000 పింఛన్ ప్రతి నెలా 1వ తేదీన వలంటీర్ల ద్వారా పంపిస్తున్నాం. ఇలా మీ ఇంటికి పింఛన్ రావాలన్నా.. వలంటీర్ల వ్యవస్థ కొనసాగాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తేనే జరుగుతుందని చెప్పండి, స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి వికలాంగుడు, ప్రతి అవ్వాతాత బయటికి వచ్చి కనీసం 100 మందికైనా చెప్పండి. ప్రతి కుటుంబానికి మంచి జరగాలంటే మనందరి ప్రభుత్వానికి అండగా నిలబడాలని చెప్పండి.ౖ మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే ఏ గ్రామంలోకి వెళ్లి చూసినా ఒక విలేజ్ సెక్రటరీ, డిజిటల్ లైబ్రరీ, ఆస్పత్రులు, రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. లంచం, వివక్ష లేకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇవన్నీ మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాకే జరిగాయని చెప్పండి.
ఐదేళ్ల క్రితం లంచం లేకుండా ప్రభుత్వ పథకాలు వస్తాయని ఊహించారా అని అడగండి. మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి లంచం లేకుండా నేరుగా మీ ఖాతాలో నగదు వేశారా అని అడగండి. ప్రజలు మొదటిసారి ఆశీర్వదిస్తే ఇంత మంచి చేయగలిగాం. రెండోసారి, మూడోసారి ఆశీర్వదిస్తే ఇంకేంత మంచి జరుగుతుందో ఆలోచించండి. బాబుకు ఓటు వేయటమంటే సామాజిక వ్యతిరేక న్యాయానికి ఓటు వేయటమే అని చెప్పండి. మేనిఫేస్టోలో ఇచ్చిన హామిల్లో 99శాతం నేరవేర్చి ఎన్నికలకు దిగబోతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్. అయ్యా చంద్రబాబు, జగన్ మార్క్ ప్రతి ఇంట్లో కనిపిస్తున్నప్పుడు మీకెందుకు ఒటు వేయాలి? అయ్యా బాబు.. జగన్కు ప్రజా బలం లేకపోతే ఇన్ని పోత్తులు ఎందుకు.. సైకిల్ తోయడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి ప్రతి పేదవాడు తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇంత మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా, వారి మంచి భవిష్యత్కు ప్రజలు రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఇక శాశ్వతంగా చంద్రముఖి బెడద ఉండదు. లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది, లకలక అంటు ప్రతి ఇంటి వస్తుంది. మీకు మంచి జరిగితేనే జగన్ ఓటు వేయండని నిబద్ధతతో ప్రజలకు చెప్పండి. మరోవంక బాబు పేదలకు ఏం చేశాడో చెప్పుకోని పరిస్థితిలో సంసిద్ధం అంటు పోస్టర్లు వేస్తుంటారు. ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం బాబూ. పేదల కోసం మేమే సిద్ధం. మనం యుద్ధం చేస్తున్నాం. వారు పెత్తందారుల తరఫున సంసిద్ధం అంటున్నారు. దుష్టచతుష్ట బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు. అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో జనం. వారితోనే నా పొత్తు.
మన పార్టీ కార్యకర్తలకు, వలంటీర్లకు, వార్టు మెంబర్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఒకటే చెబుతాను. ఇది మనందరి పార్టీ. గత టీడీపీ తమ కార్యకర్తలతో లంచాలు పిండుతూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వం ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న వారిని స్టార్ క్యాంపెయినర్లుగా మర్చింది. మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని విధంగా పదవులు ఇచ్చాం. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీ జగన్ మీకు ఎల్లప్పుడు తోడుగా ఉంటాడు. ఈ 57 నెలల పాలన చూశారు. గతంలో చంద్రబాబు పరిపాలన చూశారు. ఎలాంటి నాయకుడు మీకు కావాలి. బాబులాగా రంగురంగుల మేనిఫెస్టో చూపించి అధికారంలోకి వచ్చాక దానిని చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు కావాలా.. కష్టమైనా, నష్టమైనా మాట మీద నిలబడేవాడే నాయకుడు కావాలా.. ఈరోజు మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నేరవేర్చాం కాబట్టే, ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతున్నాం. ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసి మా నాయకుడు మాట ఇచ్చాడంటే చేస్తాడంతే అని చెప్పాలి. ప్రతి పేదకు వారి భవిష్యత్తుకు అండగా నిలిచాం. అందుకే వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 ఎంపీలు గెలవాలని అడుగుతున్నా. పరిపాలనలో మనం తగ్గలేదు. కాబట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల గెలుపులో కూడా తగ్గకూడదు. అటు టీడీపీ ఇటు వైఎస్సార్సీపీ. అటు పెత్తందారులు ఇటు పేదలు. మరో రెండు నెలల్లో జరిగే యుద్ధానికి మీరంతా సిద్ధమేనా.. చంద్రబాబు మోసపూరిత ప్రకటనల నుంచి పేదవారి భవిష్యత్తు కాపాడేందుకు మీరంత సిద్ధమేనా.. వారి మీడియా, వారి సోషల్ మీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమేనా.. మీ పాత్రే అత్యంత కీలకం, సమరభేరి మోగిద్దాం. మరో గొప్ప చారిత్రాత్మక విజయానికి మీరంత సిద్ధమేనా.. అత్యంత కీలకమైన ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి వెళ్లిపోతుంది. ఇక టీడీపీ రూపురేఖలు కూడా కనిపించవు. అందుకే పెత్తందారులు ఏకమవుతున్నారు. మన యుద్ధం చంద్రబాబుతో మాత్రమే కాదు.. పచ్చమీడియాతో, దత్తపుత్రుడితో.. ఇప్పుడు బాబు జాతీయ పార్టీని కూడా వారితో తెచ్చుకుంటున్నారు. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. మీ జగన్కు మీ ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి అవ్వాతాత, ప్రతి రైతన్న జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి. పేదవాడి భవిష్యత్తు మారాలని, పేదవాడి పిల్లలు పెత్తందారులతో పోటీ పడాలంటే ఆ పార్టీలను నాశనం చేసే పరిస్థితి రావాలి. అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి. మంచి చేస్తున్న ప్రభుత్వ కలకాలం ఉండాలని, మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నా.
అధికారంలోకి వచ్చేస్తున్నామని కలల గంటున్న ఎల్లో గ్యాంగ్కు నిన్నటి రాప్తాడు సిద్ధం సభ విజువల్స్, జగన్ స్పీచ్ చూసి చెమటలు పట్టి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.