జగన్ ప్రభుత్వం హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నపుడు, ప్రత్యేకించి తెలుగు తమ్ముళ్ళంతా సోషల్ మీడియాలో “జగన్ క్రిస్టియన్” అని పదే పదే చావగొడుతూ ఉంటారు. జగన్ హిందూ వ్యతిరేకి అని, అతనికి క్రైస్తవులంటే పక్షపాతం అనీ వారి పోస్టుల సారాంశం.
మరి అంతటి క్రైస్తవ ప్రేమికుడిగా ముద్రపడ్డ జగన్ హిందు మతం కోసం ఏం చేసాడో తెలుసా ?? చంద్రబాబు హయాంలో ఫ్లై ఓవర్ల పేరు చెప్పి ఏడు హిందూ దేవాలయాలను అడ్డుగా ఉన్నాయని చెప్పి తొలగించాడు. నిజానికి నేలమట్టం చేసాడు. మరి అప్పుడు ఈ నోళ్ళేవీ చంద్రబాబును హిందూ వ్యతిరేకి అనలేదు. పైపెచ్చు అభివృద్ధి ప్రధాత అంటూ సొంత పత్రికల్లో ఊదరగొట్టారు.
అపుడు చంద్రబాబు కూలగొట్టిన ఆలయాలన్నిటినీ జగన్ ఇపుడు పునర్మించారు. జనవరిలో 2021 శంకుస్థాపన చేసిన ఆ ఆలయాలన్నిటినీ వెంటనే పూర్తి అయ్యేలా మంత్రి వెల్లంపల్లికి ఆదేశాలిచ్చారు కూడా. దాని ఫలితమే నిన్నుటి రోజున ఆయా దేవాలయాల్లో జరిగిన ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు. చంద్రబాబు వాటిని కూల్చి పెకలించివేసినపుడు బయట పడ్డ నవరత్నాలు, బంగారు, వెండి రేకులు వంటివేవీ కూడా ప్రభుత్వ ఖజానాకు తరలించబడలేదు. కనీసం వాటి లెక్కలు కూడా బయటకు రానివ్వలేదు.
కానీ, ఇప్పుడు క్రైస్తవుడిగా ముద్రపడ్డ జగన్ సుమారు రెండున్నర కోట్లు పెట్టి ఆ దేవాలయాలన్నిటినీ పునర్మించారు. కళశ పూజ, విగ్రహ ప్రాణప్రతిష్ట మొదలగు కార్యములతో ప్రారంభమయిన ఆలయాలన్నీ భక్తులకు సందర్శనార్థం అందుబాటులోకి రానున్నాయి.