బుద్ది మంచిదే కానీ గుణమే తప్పుడుదని ఓ సామెత ఉంది. ఇప్పుడు సాంబశివరావు విషయం కూడా అలానే ఉంది. రాజకీయాలు ఎలా చేయాలో, రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో నీతి సూక్తులు చెప్పే సాంబశివరావు తాను మాత్రం ఆ నీతి సూక్తులు పాటించడం మానేసాడు. ఆయనపై నమోదైన మరో కేసు దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. తాజాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా పని చేస్తూ మోసం చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేయడంతో సాంబశివరావు చేసిన మరో మోసం వెలుగులోకి వచ్చింది.
కంపెనీ నిధులతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి సాంబశివరావు భార్య పేరుతో కారు కొనుగోలు చేశాడంటూ సంధ్యా హోటల్స్ ప్రై.లిమిటెడ్ అకౌంటెంట్ ఫిర్యాదు చేశారు. కంపెనీ అవసరాల కోసం కారు కొనాల్సి ఉండగా ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా తన భార్య విజయ దుర్గ పేరుపై కారును రిజిస్ట్రేషన్ చేయించడంతో కేసు నమోదు చేశారు. కాగా వరుణ్ మోటార్స్ కంపెనీ ఉద్యోగులతో కలిసి టీవీ5 సాంబశివరావు కారును తన భార్య పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. దీంతో వరుణ్ మోటార్స్ ఉద్యోగులపై కూడా కేసు నమోదైంది.
గతంలోనూ గచ్చిబౌలి పెట్రోల్ బంక్ ల్యాండ్ విషయంలో టివీ5 సాంబశివరావుపై ఫోర్జరీ కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా ఆయన తనపై ఓ రాజకీయ పార్టీ దుష్ప్రచారం చేస్తుందని చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ తన సొంత వ్యక్తిగత వ్యవహారాన్ని రాజకీయ పార్టీకి ముడిపెడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు వచ్చాయి. మరి తాజాగ నమోదైన కేసుపై సాంబశివరావు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.