ఐపీఎల్-2024లో భాగంగా లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా సూపర్ జెయింట్స్- సీఎస్కే మధ్య శుక్రవారం మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి సీఎస్కే 176 పరుగులు స్కోరు చేయగలిగింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి విజయం సాధించింది.
కాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు, లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. స్లో ఓవర్ రేటు కారణంగా నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఇద్దరికీ బీసీసీఐ జరిమానా విధించడం గమనార్హం. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం రాహుల్, గైక్వాడ్ లు చేసిన మొదటి తప్పుకారణంగా బీసీసీఐ ఇద్దరికీ రూ. 12లక్షలు జరిమానాను విధించింది. ఇదే తప్పు మరోసారి జరిగితే కెప్టెన్ కు 24 లక్షల జరిమానాతో పాటు జట్టులో భాగమైన ఆటగాళ్ల ఫీజులో ఒక్కొక్కరికి 25% కోత, లేకపోతే ఆరు లక్షల రూపాయల ఫైన్ విధించడం జరుగుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ తాజా ఎడిషన్లో స్లో ఓవర్రేట్ కారణంగా ఇప్పటి వరకు రిషభ్ పంత్కి రెండు సార్లు, శుబ్మన్ గిల్కి ఒకసారి, సంజూ సామ్సన్కి ఒకసారి, శ్రేయస్ అయ్యర్కి ఒకసారి, హార్దిక్ పాండ్యాకి ఒకసారి బీసీసీఐ జరిమానా విధించింది. తాజాగా కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ జాబితాలో చేరడం విశేషం.