స్వచ్ఛమైన కళ్ళు, కల్మషం ఎరుగని చిరునవ్వు ఆ తల్లి సొంతం.
ఆమె ఎరగదు సోషల్ మీడియాని, ఆమె ఎరగదు ఇక్కడి వికృత పోకడలని,
ఆమెకి తెలీదు ఇక్కడ కాల నాగులు, కసాయి తోడేళ్ల మంద సాగించే వేట గురించి,
ఆమెకి అర్ధం కాలేదు, కేవలం అభిప్రాయం చెబితేనే పందుల గుంపులా దాడి చేస్తారని, రాక్షసుల్లా పీక్కు తింటారని.
తనకి సంభంధం లేని కనీసం పరిచయం కూడా లేని వ్యక్తులు నిస్సహాయంగా లేడి పిల్లలా నిలబడ్డ అబల పై నిష్కారణంగా కుక్కల గుంపులా దాడి చేసి వ్యక్తిత్వ హననం చేస్తారని,
ఆమెకి తెలీదు సోషల్ మీడియా కాల నాగులా కాటేసి కబలించి వేస్తుందని.
ఆమె ఎరగదు వికృత పోకడలు పోతున్న సోషల్ మీడియా చేతిలో తాను బలయ్యి అభం శుభం తెలీని తన ఇద్దరు పసిబిడ్డలని అనాధలని చేస్తుందని.
స్వచ్ఛమైన ఆ కళ్ళల్లో మెరుపులు మాయమయ్యాయి, ఈ పాడు లోకాన్ని చూడలేమని మూతబడ్డాయి. కల్మషం ఎరగని చిరునవ్వుతో పలకరించే ఆ నోరు మూగవోయింది.
సోషల్ మీడియాతో ఏ మాత్రం సంభంధం లేని ఒక మహిళ ప్రభుత్వం నుంచీ తానిలా లబ్ది పొందానని చెప్పిన పాపానికి ఆమె పేరు, ఊరు తెలుసుకొని టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు చేసిన మానసిక దాడికి, వ్యక్తిత్వ హననానికి తీవ్ర వేదనతో ఆత్మహత్యా యత్నం చేసి మూడు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన సోదరి గీతాంజలికి శ్రద్ధాంజలి.