గ్రూప్ 1 నోటిఫికేషన్ డిసెంబర్ 8-2023 ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 రాసే అభ్యర్థులకు ఆ పరీక్షకు సంబంధించి అప్లై చేయడానికి జనవరి 1 2024 నుంచి అవకాశం కల్పించింది. అప్లై చేయడానికి జనవరి 21-2024 చివరి తేది కాగా ఇంకా అప్లై చేసుకొని అభ్యర్థులు అభ్యర్థన మేరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీని ఈ నేల 28 వరకు పొడిగించింది. కాగా ప్రిలిమ్స్ పరీక్ష మాత్రం యధావిధిగా ముందు అనుకున్న ప్రకారం 17 మార్చి 2024లో జరుగుతుంది అని బోర్డ్ తెలిపింది.
గ్రూప్ 1 పరీక్ష మూడు స్టేజ్ లలో జరుగుతుంది, మొదట ప్రిలిమ్స్ కాగా, రెండోది మెయిన్స్, చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది.