ఇప్పటివరకు రాజమండ్రి ఎంపీ స్థానానికి గత నాలుగుసార్లు జరిగిన ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపును అనపర్తి నియోజకవర్గ మెజారిటీనే నిర్ణయిస్తూ వస్తున్నది, ఇప్పుడు ఇదే కూటమి తరపున రాజమండ్రిలో పోటీలో ఉన్న పురందేశ్వరికి వణుకు పుట్టిస్తోంది. అనపర్తి ప్రజలు ఎప్పుడైనా గంప గుత్తుగా ఒకే పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్నారు. గతంలో అనపర్తి దెబ్బకు మురళీమోహన్ చేదు అనుభవం రుచి చూసి వున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన మార్గని భరత్ మెజారిటీలో అనపర్తి నియోజకవర్గందే కీలక పాత్ర. ఇవన్నీ గమనించిన పురంధేశ్వరి అనపర్తిలో తను చేసిన తప్పుల దెబ్బకు ఓటమి తప్పదని మదనపడుతున్నారు.
అనపర్తి నియోజకవర్గంలో 2.22 లక్షల మంది ఓటర్లు ఉన్నారు,వీరు ఏ పార్టీ కి మొగ్గుచూపిన గంపగుత్తగా 50 వేల పైనే మెజారిటీ ఇస్తారు .ఇందుకు మంచి ఉదాహరణ 2009లో రాజమండ్రి ఎంపీగా అప్పటి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ విజయం. ఆరోజు ఉండవల్లి అరుణ్ మీద కక్ష గట్టిన ఈనాడు, టీడీపీ మురళీ మోహన్ ను రంగంలోకి దింపారు. రాజమండ్రి ఎంపీ కింద వున్న ఆరు నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీ వచ్చింది అయితే అనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి 60 వేల మెజారిటీ రావడంతో 10వేల తేడాతో మురళీ మోహన్ ఓడిపోయారు. అనపర్తి దెబ్బకు మురళీమోహన్ కోలుకోవడానికి కొన్నీ నెలలు పట్టింది. ఇక 2019లో మర్గని భరత్ కు 1,21,000 మెజారిటీ వచ్చింది అందులో ఒక్క అనపర్తి నుండే 62,000 మెజారిటీ వచ్చింది సగానికి సగం ఇక్కడే వచ్చింది.
బిజెపి నాయకత్వం గోదావరి జిల్లాలో ఏదైనా ఒక స్థానంలో పోటి చెయ్యాలని అనపర్తి నియోజకవర్గం ఎంచుకుంది అయితే టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి దెబ్బకు ఏమీ చెయ్యాలని స్థితికి వచ్చింది. చివరకు చంద్రబాబు తన చాణిక్యంతో టీడీపీ నుండి బిజెపి లోకి జాయిన్ చేపించి బిజెపిలో టికెట్ ఇప్పించారు.అయితే అప్పటి వరకు నల్లమిల్లి కోసం గొడవలు చేసిన టీడీపీ కార్యకర్తలు బిజెపిలో జాయిన్ అవ్వడం తట్టుకోలేక ఇప్పటికే క్రియాశీల కార్యకర్తలు అందరు వైసీపీలో జాయిన్ అవుతున్నారు. ఇవన్నీ గమనించిన పురంధేశ్వరి టికేట్ విషయంలో జరిగిన గొడవలను గత అనపర్తి సెంటిమెంట్ లను చూసి అనపర్తి లో నల్లమిల్లి ఓటమి చెందుతారు ఆ ఎఫెక్ట్ తన పార్లమెంట్ మీద పడుతుంది అని తెగ భయపడుతున్నారు.