ఐపీఎల్ కు వెళ్ళనున్న ఆడుదాం-ఆంధ్రా విజేత
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామాల నుండే పునాదులను నిర్మిస్తుంది. గ్రామీణ ప్రాంతం క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్రస్థాయిలో ఆడుదాం-ఆంధ్రా పోటీలు నిర్వహించింది. ఇప్పుడు ఆడుదాం-ఆంధ్రా పోటీల్లో రాణించిన క్రీడాకారులకు ఆఫర్లు వరుసకడుతున్నాయి.
ఆడుదాం-ఆంధ్రా క్రికెట్ పోటీల్లో రాణించిన జామి మండలం అలమండకు చెందిన కె.పవన్ కు ఐపీఎల్ లో ఆడే అవకాశం చేరువైంది. యువకుడి ప్రతిభను గుర్తించిన CSK (చెన్నై సూపర్ కింగ్) టీం అతన్ని దత్తత తీసుకుంది.. శిక్షణ ఇచ్చి జట్టులో ఆడే అవకాశం కల్పించనుంది.
పవన్ నేపథ్యం.. పవన్ కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మక్కువ. మొదట్లో ఇంటి వెనుక ఉన్న చిన్న గ్రౌం డ్ లో క్రికెట్ ఆడుకునేవాడు. తరువాత గ్రామంలో హైస్కూల్ గ్రౌండ్ లో ఆడేవాడు. స్కూల్ పోటీలలో క్రికెట్ లో బాగా రాణించేవాడు. క్రికెట్ లో శిక్షణ తీసుకోవడానికి ఎటువంటి ఆసరా లేని.. చాలా నిరుపేద కుటుంబం పవన్ ది. తల్లీదండ్రులు చిన్న వయసులోనే మృతిచెందారు. మామయ్య పైడిరాజు వద్ద ఉంటున్నాడు. ఈ సమయంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఆడుదాం-ఆంధ్రా క్రీడాపోటీలకు హాజరయ్యాడు. మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయి పోటీల్లో అలమండ జట్టు విజయంలో పవన్ ఆల్ రౌండర్ ప్రతిభ చూపాడు. విశాఖపట్నంలో జరిగిన సెమీ ఫైనల్స్ లో ఫీల్డింగ్, బౌలింగ్ లో ప్రతిభ చూపాడు. పవన్ లోని క్రీడా నైపుణ్యాన్ని CSK గుర్తించి దత్తత తీసుకుంది. రానున్న రోజుల్లో పవన్ ఐపీఎల్ కు ఆడబోతున్నాడు.
CSK దత్తత తీసుకున్న క్రికెటర్ పవన్ మీడియాతో మట్లాడుతూ.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి మంచి ఆలోచనతో ఆడుదాం- ఆంధ్రా క్రీడాపోటీలు నిర్వహించారు. దీనివల్ల మా లాంటి గ్రామీణ క్రీడాకారులు ప్రతిభ చూపేందుకు వేదిక దొరికింది. CSK దత్తత తీసుకోవడం ఆనందంగా ఉంది. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ముఖ్యమంత్రి అభినందించారని తెలిపారు.