లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చా, వేల కంపెనీ లు పట్టుకొచ్చా, దావోస్ లో పప్పన్నం పెట్టి కంపెనీ లను పిలిచా అని డప్పేసుకునే బాబు హయాంలో మొత్తంగా ఐదేళ్లలో వాస్తవం గా గ్రౌండ్ అయిన పారిశ్రామిక రంగ పెట్టుబడులు 32,803 కోట్లు మాత్రమే.. కానీ జగన్ అభివృద్ధి చేయడం లేదు, జగన్ ని చూసి కంపెనీ లు పారిపోతున్నాయి అని ప్రచారం చేస్తూ జనాలను నమ్మించాలని చూసినా వాస్తవానికి అధికారిక లెక్కలు ఎందుకు భిన్నంగా ఉన్నాయి,2019 నుండి 2023 చివరి నాటికి ఏపీ లో 1,00,103 కోట్లు అనగా అక్షరాల లక్షా నూట మూడు కోట్ల రూపాయలు వాస్తవ పెట్టుబడులు పరిశ్రమల రంగంలో గ్రౌండ్ అయి ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి..
ఏదైనా ఒక పరిశ్రమ పెట్టుబడులు పెట్టాలి అని నిర్ణయించుకుంటే డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPIIT) వారి వద్ద ఇండస్ట్రియల్ ఎంటర్ ప్రీన్యూర్ మెమోరాండం (IEM) లో పార్ట్ A ఫైలింగ్స్ చేయాల్సి ఉంటుంది. అదే పరిశ్రమ పెట్టుబడి పెట్టి తన కార్యకలాపాలు మొదలు పెట్టాలి అంటే IEM పార్ట్ బి ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే DPIIT వారి IEM పార్ట్ బి ఫైలింగ్స్ ద్వారా ఎన్ని పరిశ్రమలు వచ్చాయి వాస్తవంగా మొత్తం ఎంత మొత్తం పెట్టుబడి పెట్టారని తెలుస్తుంది…
ఆ IEM part-B ఫైలింగ్స్ లెక్కలు అన్నీ తీయగా బాబు హయాంలో కన్నా మూడు రెట్లు అధికంగా రాష్ట్ర పారిశ్రామిక రంగంలో వాస్తవ పెట్టుబడులు గ్రౌండ్ అయినట్లు తేలింది..ఇక కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయినప్పటికి రాష్ట్రం లో కూడా దాని ప్రభావం ఉన్నా కూడా ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం అనేది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విశేష కృషికి తార్కాణం… ఎల్లో మీడియా, టీడీపీ సోషల్ మీడియా, బాబు అండ్ కో ఎందరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వాస్తవాలు మాత్రం ప్రజలందరికీ అర్థం అవుతాయి…