2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ను గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రైల్వేలకు జరిగిన కేటాయింపుల గురించి ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్లు ఇచ్చామన్నారు. అప్పటి నుంచి నిధులు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి 240 కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 98 శాతం విద్యుద్దీకరణ పూర్తయ్యాయన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయమై ఆయన కీలక ప్రకటన చేశారు. 53 ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినట్లు వెల్లడించారు. ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేసి కేంద్రానికి అప్పగిస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం డీఎపీఆర్ సిద్ధమైందన్నారు.