బియ్యం రేట్లు భగ్గుమంటున్న సమయంలో సామాన్య ప్రజలకు ఊరటనిచ్చేలా ఫుడ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ వారి సహకారంతో భారత్ రైస్ ను రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపూర్ జిల్లా కదిరి తాలూకాలో ట్రయిల్ రన్ నిర్వహించగా అక్కడికి కేటాయించిన బియ్యం నాలుగు రోజులకే అయిపోయాయి. సన్న బియ్యం రేట్లు నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ ను అందుబాటులోకి తీసుకొనిరావాలని నిర్ణయించింది. ఐదు, పది కేజీలుగా ప్యాక్ చేసిన బియ్యాన్ని నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్ ఫెడరేషన్ (ఎన్ సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (నాఫెడ్), కేంద్రీయ భండార్ సంస్థల ద్వారా రిటైల్ పాయింట్లలో విక్రయించనున్నారు. కాగా ఇప్పటికే ఈ రిటైల్ పాయింట్లు ద్వారా భారత్ బ్రాండ్ పేరుతో కిలో శనగ పప్పు రూ.60, గోధుమ పిండి కిలో రూ.27.50కే విక్రయిస్తున్నారు. వీటికి తోడుగా ఇప్పుడు భారత్ రైస్ ను చేర్చి రూ. 29కే అమ్మనున్నారు. ఇటీవల ఊహించని విధంగా పెరిగిన ధరలతో కొత్త బియ్యం తినలేక, పాత బియ్యం కొనలేని పరిస్థితులలోకి సామాన్య ప్రజలు చేరుకున్నారు . ఇప్పుడు భారత్ రైస్ ద్వారా సామాన్య ప్రజలకి భారీగా ఊరట కలగనుంది.
ప్రస్తుత బియ్యం రేట్ల పరిస్థితి చూస్తే పాత బియ్యం రేట్లు ఆకాశంను తాకుతున్నాయి వంద కేజీల గల బియ్యం బస్తా ధర రూ. 7500 నుంచి 8000 వేలు పలుకుతున్నాయి. అంటే కేజీ రూ. 75 నుంచి రూ.80 దాఖ అమ్మకాలు జరుగుతున్నాయి . ఇంకా కొత్త బియ్యం విషయానికి వస్తే అవి కూడా రేట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి . హెచ్ఎంటీ, బీపీటీ, సోనామసూరి ధరలు క్వింటాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరిగాయి. గతంలో రూ. 4500 నుంచి రూ.5000 దాఖ ఉండేవి అవి ప్రస్తుతం రూ . 6200 నుంచి రూ. 6500 దాఖ పెరిగాయి. అంటే రూ. 45 నుంచి రూ. 50 ఉన్న కిలో రూ. 62 నుంచి రూ. 65 దాఖ పెరిగింది దాదాపు 25 నుంచి 30 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఒక సామాన్యుడు ఇంత రేట్ పెట్టి తినగలడా అంటే అది అసాధ్యం, దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుతం ప్రభుత్వం ఈ భారత్ రైస్( సన్న బియ్యం) ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు మొత్తం 7250 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఈ నెలాఖరుకు అందుబాటులోకి రానున్నాయి ,కాగా బియ్యం కొనుగోళ్ళకు సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని ఇండియా ఏపీ జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ యాదవ్ ఒక మీడియా సమావేశంలో తెలిపారు.