తెలుగు ఖ్యాతి ఎల్లలు దాటి ఖండాంతరాల అవతల వెల్లివిరిసింది. దేశ సరిహద్దులు దాటి తెలుగుజాతి ఔన్నత్యాన్ని అగ్రరాజ్యంలో అగ్రభాగాన నిలబెట్టింది. అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన ఘనతను సాధించింది. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళా విజయకేతనం ఎగురవేసింది. భారతదేశ గౌరవ ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపచేస్తూ, భరత జాతి గొప్పతనానికి ఖండాంతరాల అవతల పట్టం కట్టింది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికా దేశంలో తెలుగు మహిళ అత్యున్నత స్థానాన్ని అధిరోహించింది.
వివరాల్లోకి వెళితే… భారతదేశ సంతతికి చెందిన జయ బాడుగ అనే తెలుగు మహిళ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాలోని కాలిఫోర్నియాలో శాక్రమెంటో కౌంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితురాలై అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.. తెలుగు రాష్ట్రం నుంచి కాలిఫోర్నియాలోని సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా మొట్టమొదటి పదవి అలంకరణ చేసిన ఏకైక తెలుగు మహిళ జయ బాడుగ అని చెబుతున్నారు విశ్లేషకులు.
జయ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువులు నిమిత్తం అమెరికా వెళ్లడం జరిగింది. బోస్టన్ యూనివర్సిటీలో ఏంఏ పూర్తి చేసిన అనంతరం శాంటా క్లాస్ యూనివర్సిటీలో న్యాయవిద్యం పూర్తి చేశారు జయ. 2009లో కాలిఫోర్నియా బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జయ న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కావడం తెలుగువారికి ఎంతో గౌరవం తెచ్చిపెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. అలాగే దానితోపాటు ఆమె మాజీ ఐఎస్సీ, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ బాడికి రామకృష్ణ మనవరాలు కావడం విశేషం.