దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఎన్నికల బరిలో నిలబడి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సైతం గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడు నుండి ఎన్నికల బరిలో నిలవనున్నారు. కాగా తాజాగా ఏనుగు దంతాలు, గంధపు చెక్కల స్మగ్లర్ గా పేరుపొందిన వీరప్పన్ కుమార్తె విద్యా రాణి కూడ లోక్సభ ఎన్నికల పోటీలో నిలబడనున్నారు.
గతంలో భారతీయ జనతాపార్టీలో ఉన్న విద్యా రాణి తమిళ్ నేషనలిస్ట్ పార్టీ ఆఫ్ నామ్ తమిజర్ కచ్చిలో చేరారు. నటుడు, దర్శకుడు సీమాన్ ఏర్పాటు చేసిన ఎన్టీసీ పార్టీ తరపున కృష్ణగిరి లోక్సభ స్థానం నుంచి విద్యా రాణి పోటీకి దిగనున్నట్లు తెలుస్తుంది. విద్యా రాణి న్యాయవాదిగా పని చేస్తున్నారు. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అనంతరం ఎన్టీకే పార్టీలో చేరారు. తాజాగా లోక్సభ బరిలో నిలిచారు.