రాజధాని ఫైల్స్ సినిమాకి హైకోర్టు బ్రేక్ కార్డు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయంగా లబ్ది పొందుదామని టీడీపీ ప్రోత్బలంతో తెరకెక్కించిన రాజధాని ఫైల్స్ సినిమాకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ఏకైక ఉద్దేశంతో తీసిన సినిమా అంటూ న్యాయవాది వీఆర్ఎన్ ప్రశాంత్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.
2014 నుండి 2019 వరకు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని పేరిట చేయని అక్రమం లేదు, రైతులను మోసం చేసి భూములు చేజిక్కించుకోవడం దగ్గర నుండి అసైండ్ భూములని బెదిరించి కోనుగోలు చేయడం వరకు నారాయణ , లోకేష్ సూత్రదారులుగా భారీ కుంభకోణామే జరిగింది. దీనిపై ఇప్పటికే పలు కోర్టుల్లో కేసులు సైతం నడుస్తున్నాయి.
అయితే 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాలు అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తూ రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని ముందుకు తెచ్చారు. దీంతో రైతుల నుండి మోసం చేసి తీసుకున్న భూములు విలువ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో రియల్టర్లే రైతుల వేషంలో స్పాన్సర్డ్ ఉద్యమం మొదలుపెట్టారు. ఈ ఉద్యమం మాటున మొదటి నుండి టార్గెట్ చేసింది ముఖ్యమంత్రి జగన్నే అన్న విషయం కొత్తగా చెప్పనవసరంలేదు.
టీడీపీ పార్టీ, దాని బినామీలు కలిసి రైతులమంటూ చేస్తున్న ఉద్యమం ప్రతీ దశలోను విఫలం అవ్వడంతో ఎన్నికల వేళ సినిమా మాటున అధికార పార్టీని టార్గెట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో ఊద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని కించపరిచినట్టు ఉందని కోర్టు అభిప్రాయ పడటంతో సినిమా ప్రదర్శనపై కోర్టు స్టే విదించింది.
సినిమా రంగంతో పరిచయాలు ఉన్న కారణంగా ఎన్నికల ముందు సినిమాలు తీసి ప్రజలకి వాస్తవాలు చూపిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ లేనిది ఉనట్టు చూపిస్తే 2019 ముందు బాలకృష్ణ తీసిన మహానాయకుడు , కధానాయకుడు మాదిరే దారుణమైన ఫలితాన్ని మూటకట్టుకోవాల్సి వస్తుంది. నేడు విడుదలై మొదటి రెండు ఆటలు ఆడిన రాజధాని ఫైల్స్ చిత్రంలో కూడా అభూత కల్పనలే ఎక్కువ ఉండటంతో కోర్టు స్టేకు ముందే ప్రజల నుండి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.