శతాబ్దాలుగా హిందువులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. రామ మందిరాన్ని కూలగొట్టి బాబ్రీ మసీదుని నిర్మించారని చరిత్ర చెపుతోంది. ఆ మసీదును ఎన్నో చర్చలు, వాదోపవాదాలు, బుజ్జగింపుల తర్వాత, సహనం కోల్పోయిన కరసేవకులు 1992 డిసెంబర్ 6 న నేల మట్టం చేశారు.
ఆ తర్వాత అనేక పరిణామాలు, కోర్టులు, వాదనల తర్వాత అయోధ్య రామాలయం త్వర త్వరగా పూర్తయింది. జనవరి 22న బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో బాల రాముడి విగ్రహం ఫొటోలు సోషల్ మీడియాలో కనువిందు చేస్తున్నాయి.
హిందువులంతా రామ భక్తి లో తేలియాడుతున్నారు. 22న అందరూ మాంసాహారం త్యజించాలనీ,ప్రతిష్ట సమయాన ఇంట్లో 5 దీపాలు వెలిగించాలని పలువురు పిలుపులు ఇచ్చారు. మాంసాహారం అమ్మే దుకాణాలు స్వచ్చందం గా ఆ రోజు దుకాణాలు మూసి వేయడానికి నిర్ణయించుకున్నారు.
ఆలయం విశిష్టతలు ఒక సారి చూస్తే
1.ఆలయం మొత్తం ప్రాంతం; 70 ఎకరాలు
2.నిర్మాణం జరిగిన ప్రాంతం 57,400 చదరపు అడుగులు
3. ఆలయం పొడవు :360 అడుగులు
4.వెడల్పు : 235 అడుగులు
5.గోపురంతో కలిపి ఆలయం ఎత్తు 161 అడుగులు
6.మొత్తం అంతస్థులు = 3 అంతస్థులు
7. ప్రతి అంతస్థు ఎత్తు 20 అడుగులు
గ్రౌండ్ ఫ్లోర్ లో 160 స్థంభాలుండగా, మొదటి అంతస్థులో 132, రెండో అంతస్థులో 74 స్థంభాలు ఉన్నాయి.
ఆలయంలో మొత్తం 12 ద్వారాలు ఉన్నాయి
మొదటి అంతస్తులోని ప్రధాన గర్భ గుడిలో రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహం ఉంటుంది. ఇక్కడే రామ్ దర్బారు కూడా ఉంది.
నృత్య మండపం, సభా మండపం, కీర్తనా మండపాలను గుడిలో నిర్మించారు.
తూరుపు ప్రవేశపు సింహ ద్వారం వద్ద 32 మెట్లు ఉంటాయి.
వృద్ధులు, వికలాంగులు గుడిలోకి వెళ్ళేందుకు లిఫ్ట్ సౌకర్యం ఉంది
మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పు గల ప్రహరీ గోడ నిర్మించారు.
మందిర నిర్మాణంలో ఎక్కడా ఇనుము వాడలేదు. దేవాలయాన్ని నాగర శైలిలో నిర్మించారు. మందిరానికి సంబందించిన చెక్క ద్వారలాలన్నీ హైద్రాబాద్ నుంచే అయోధ్యకు తరలి వెళ్లాయి.
నేల లోని తేమ నుంచి రక్షించేందుకు గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తైన పునాదిని నిర్మించారు
బిజెపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన రామాలయ ప్రతిష్టకు వివిధ రంగాల ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందార్యి
క్రీడాకారులు, కళాకారులు, సినిమా రంగ ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అలాగే వివిధ పీఠాధిపతులకు,ఆధ్యాత్మిక గురువులను కూడా ఆహ్వానించారు.
ఇప్పటికీ అయోధ్య లో హోటళ్ళనీ బుకింగ్స్ తో నిండి పోయాయి. 150 దేశాల నుంచి రామ భక్తులు ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.
శ్రీరామ ప్రాణ ప్రతిష్ట 22న మధ్యాహ్నం 12;20 నుంచి ఒంటిగంట మధ్యలో జరుగుతుంది. 21, 22 తేదీలలో సాధారణ భక్తులను ఆలయంలోకి అనుమతించరు. 23 నుంచి వారిని ఆలయంలోకి అనుమతించనున్నారు.