పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై జగన్ ప్రభుత్వం అత్యంత కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసులు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఏలూరి మీద కుట్ర అంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తుంది. జీఎస్టీని ఎగ్గొడుతున్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చైర్మన్గా వ్యవహరిస్తున్న గుంటూరులోని నోవా అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో జనవరి 24 న డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో […]
తెలుగుదేశం పార్టీ నాయకులు నడిరోడ్డుపై హత్య చేసినా చంద్రబాబు నాయుడు వెనకేసుకొస్తారు. ఎల్లో మీడియా సహకారంతో దానిని ఆత్మరక్షణ కార్యక్రమంగా చిత్రీకరిస్తారు. ఇదంతా ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. నోవా అగ్రిటెక్ మాటున అక్రమాలకు పాల్పడిన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విషయంలో ఇదే జరిగింది. మంగళవారం మార్టూరులో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీలకు వెళ్లిన మైనింగ్, విజిలెన్స్ అధికారులపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడులకు తెగబడ్డారు. తనిఖీలు చేయొనిచ్చేది లేదంటూ మైనింగ్ ఏడీ, ఇతర అధికారులను దుర్భాషలాడారు. […]
టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి పనులకు పాల్పడుతుందనేది ఈమధ్య వెలుగులోకి వచ్చింది. 2019 ఎన్నికలలో దొంగ ఓట్ల గురించి కీలకమైన ఆధారాలు లభించాయి. వాస్తవానికి నల్లధనం కేసుతో మొదలైన వ్యవహారం దొంగ ఓట్ల తో కొలిక్కి వచ్చింది.. జీఎస్టీ ఎగవేస్తున్న కంపెనీల జాబితాను సేకరించిన కేంద్ర ప్రభుత్వం.. ఆ జాబితాను రాష్ట్రాలకు పంపింది. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న ఆ కంపెనీల్లో తనిఖీలు చేయాలని ఆదేశించింది. ఈమేరకు జాబితాలో ఉన్న పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు […]