– కాంగ్రెస్ పార్టీపై విజయసాయిరెడ్డి కన్నెర్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ క్షమించరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై చర్చ జరగ్గా ఎంపీ పాల్గొన్నారు. ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కన్నెర్ర చేశారు. ఆయన ఏమన్నారంటే.. 2004లో తెలంగాణ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఎన్నికల్లో లాభం పొందాలని […]
మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణల కారణంగా లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించేందుకు మణిపూర్ వెళ్లిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇంఫాల్ విమానాశ్రయం నుండి నేరుగా ‘ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లిన రాహుల్ 1891 ఆంగ్లో- మణిపుర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు. అనంతరం మణిపూర్లోని […]
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉనికి నిలబెట్టుకోవడం కోసం పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను కాంగ్రెస్ అధినాయకత్వం ఎంపిక చేయనుందని రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసారు. నిన్న మణిపూర్ లో భారత్ జోడో న్యాయ్ యాత్రను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ షర్మిల కూడా హాజరయ్యారు. […]