ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్థలాలో అరకుది అగ్ర స్థానం. అందమైన అరకు లోయలలో పరచుకున్న పచ్చదనాన్ని చూడడానికి ఏటా లక్షలాది మంది అరకుని సందర్శిస్తారు. గిరిజన జీవన శైలిని ప్రతిబింబించేలా పర్యాటక శాఖ చేసే ఏర్పాట్లు కూడా చూపరులను విశేషంగా ఆకట్టుంటాయి.
అటువంటి అరకులో సహజ సిద్దంగా ఏర్పడిన గుహల సముదాయం “బొర్రా గుహలు”.1807 విలియం కింగ్ అనే అతను గుర్తించిన ఈ గుహలు సున్నపు రాతితో ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడినవి. వాతావరణంలోని మార్పులను అనుసరించి ఆ సున్నపురాయి కరిగి మానవమెదడు, శివలింగం. డైనోసార్, మొసలి, శివపార్వతి, తల్లీబిడ్డ, రుషి, సాయిబాబా, తేనెపట్టులా ఏరపడ్డ వివిధ ఆకృతులను చూసి పర్యాటకులు విపరీతంగా ఆకర్షితులవుతారు.
అటువంటి విశ్వఖ్యాతి పొందిన బొర్రా గుహలను, ఆంధ్రప్రదేశ్ నుంచి పర్యాటక ప్రదేశాలలో మరింత సుందరంగా తీర్చిదిద్దే అవకాశం గల ప్రాంతంగా రాష్ట్ర పర్యాటక శాఖ తమ ప్రతిపాదనను కేంద్ర పర్యాటక శాఖకు సమర్పించడంతో, బొర్రా గుహలను అతి సుందరంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందు కోసం రూ.29.88 కోట్లను మంజూరు చేసింది. గురువారం ఈ పనులకు ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్ నుంచి పర్చువల్ శంకుస్థాపన చేశారు.
2000 సంవత్సరం ముందు వరకూ… గిరిజనులు కొంతకాలం, స్థానిక గిరిజనులకు టికెట్ పై కమిషన్ ఇస్తూ ప్రభుత్వం ఆ తరువాత బొర్రాగుహల నిర్వహణ నడిపేవారు. 2000 నుంచి పర్యాటకశాఖ నిర్వహిస్తోంది. వచ్చే ఆదాయంలో కొంతమేర గుహల అభివృధ్ధికి కేటాయించింది.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ సందర్శన్ పథకం లో భాగంగా మంజూరు చేసిన రూ.23.88 కోట్లతో మూడు విభాగాల్లో అభివృద్ధి పను లు చేపట్టనున్నారు. మొదటి విభాగంలో రైల్వేస్టేషన్ నుంచి కొండప్రాంతంలోని పార్కింగ్ ప్రదేశం వరకు రోడ్డుమార్గం లోని దారిపొడవునా వీధి లైట్లు ఏర్పాటు చేస్తారు. పార్కింగ్ ప్రదేశాన్ని సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటుగా పచ్చదనం తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. రెండో విభాగంలో బొర్రాగుహలు ముఖద్వారం వద్ద తాత్కాలికంగా షాపింగ్ స్ట్రీట్ టు చేస్తారు. మూడో విభాగంలో ఏర్పాటు బొర్రా ముఖద్వారం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం క్యాష్ లెస్ టికెట్ విధానంలో అమలు చేస్తారు. సందర్శన టికెట్లు ఆన్ లైన్, పేటీఎం ద్వారా బుక్ చేసుకునే సౌక ర్యం ఉంటుంది. ఇప్పటివరకు బొర్రా గుహల్లో 40 వరకు బెల్జియం లైట్లు ఉండ గా, మరో 60 అదనంగా ఏర్పాటు చేయ నున్నారు. పర్యాటకశాఖ ఈఈ రమణ మాట్లాడుతూ బొర్రాగుహల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్రం నుంచి విడుదల అయిన ఈ నిధులను పనులకు సంబంధించి టెండర్ పూర్తి కాగానే మొదలు పెడతామని చెప్పారు.