మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికలు రాష్ట్రంలోని ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజుకు మూడు బహిరంగ సభలు నిర్వహిస్తూ చంద్రబాబు పాలనలో జరిగిన అరాచకాలను వివరిస్తూ వస్తున్న సీఎం జగన్ తాజాగా పల్నాడు జిల్లా క్రోసూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది. […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల గడువు ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోసం సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని అనంతపూర్ జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఈరోజు ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం బస్సుయాత్రతో రాష్ట్రాన్ని చుట్టేసిన సీఎం వైఎస్ జగన్ మరో ఎన్నికల […]
ఎన్నికల్లో గెలవడానికి తెలుగుదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లేందుకు వారికి ఓ పేరు కావాల్సి వచ్చింది. ఎన్నో తర్జనభర్జనల తర్వాత రా కదలి రా అంటూ చంద్రబాబు నాయుడు సభలు ప్రారంభించారు. ఆ పేరుతో అనేక చోట్ల సభలు నిర్వహించగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అటు టీడీపీ.. ఇటు జనసేన కార్యకర్తలు పట్టించుకోలేదు. ఇక లోకేశ్ శంఖారావం సభల పరిస్థితి అంతే. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం పేరుతో నాలుగు సభలను విజయవంతంగా నిర్వహించారు. […]