2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి మంచి భోజనం అందించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంది. కాగా మధ్యాహ్నం అందించే భోజనంలో ఇప్పటికే తగిన పోషక విలువలు గల ఆహారాన్ని అందిస్తున్నామని, దీనికి తోడుగా ఇంకా మంచి ప్రణాళికలు రూపొందించి వచ్చే ఏడాదికి మరింత పోషకాలు గల ఆహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. జగనన్న గోరుముద్ద ద్వారా […]
తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కారు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అస్తవ్యస్తంగా అమలయ్యేది. రుచి లేని.. ఉడకని ఆహారాన్ని విద్యార్థులకు పెట్టేవారు. పర్యవేక్షణ కొరవడటంతో నిర్వాహకులు ఏదో పెట్టామంటే పెట్టి మమ అనిపించేవారు. ఆ భోజనాన్ని తినలేక కొందరు పిల్లలు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకునేవారు. ఆ పరిస్థితిలేని పేద బాలలు బడిలో పెట్టే ఆహారాన్నే కష్టంగా తినేవారు. వారంలో రెండు కోడిగుడ్లను మహా కష్టంగా అందించేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకం స్వరూపమే […]