ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 13 వ తేదీన విజయవాడకు వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డిపై సతీష్ అనే నిందితుడు రాయితో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. బస్సుకు 20 అడుగుల దూరం నుంచి వివేకానంద స్కూల్ పక్కన రోడ్డుపై ఉన్న సతీష్ సిమెంట్ రాయి ముక్కతో దాడి చేసాడని పోలీసులు వెల్లడించారు. […]
మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న సీఎం జగన్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఆయన ఎడమ కంటి పై భాగంలో కనుబొమ్మ పైన గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం చెలరేగింది. సీఎం జగన్పై దాడి జరగడంపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దాడికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీస్ శాఖ నిమగ్నమైంది. జగన్పై దాడి జరిగిన ప్రదేశంలోని సెల్ లొకేషన్ టవర్ పరిధిలోని ఫోన్ కాల్స్ పై […]