చేతిలో కాగితం పెన్ను ఉంది కదా అని బహిరంగ లేఖలు పేరున అబద్ధాలు,అభూత కల్పనలు రాయడం ఈ మధ్య ప్రతిపక్షానికి నిత్యకృత్యంగా మారింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం అధికారం కోసం అర్రులు చాచుతూ ఈ విధమైన బురదజల్లే కార్యక్రమాన్ని భుజాన వేసుకునట్టు కనిపిస్తుంది. తమ పాలనలో , తామ పార్టీ నేతల అండదండలతో జరిగిన అవకతవకలను ప్రజలు మరిచిపోయారనే ఆలోచనతో, అదే అవకతవకలకి సంబంధించి తమ పార్టీనే నేడు పోరాడుతున్నట్టు భ్రమలు కల్పించే విధంగా బహిరంగ […]
జరిగింది ఒకటైతే దాన్ని మరొకలా చిత్రీకరించే రామోజీ మరోసారి అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేసాడు. జర్నలిజం విలువలను తుంగలో తొక్కుతూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలిచిన జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగడం రామోజీ ఓ రాజకీయ పార్టీకి లబ్ది కలిగించేలా రాతలు రాస్తున్నారనడానికి నిదర్శనం. నిజానికి 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు 930 కోట్లు చెల్లించి జగన్ ప్రభుత్వం ఆదుకుంటే ఆ విషయాన్ని కప్పిపెడుతూ అసలు అగ్రిగోల్డ్ బాధితులను జగన్ […]