ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్, యూట్యూబర్ అబ్రదీప్ సాహా అలియాస్ యాంగ్రీ రాంట్మెన్ చిన్న వయసులోనే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాంట్మ్యాన్ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచాడు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అబ్రదీప్ సాహా రాంట్ మ్యాన్ అనే సోషల్ డియా పేరుతో నిత్యం సమాజంలో ప్రతి రోజూ జరిగే అంశాలతో పాటు క్రికెట్, ఫుట్బాల్, పాలిటిక్స్, సినిమా రివ్యూల గురించి తనదైన శైలిలో కోపంగా ముఖాన్ని పెడుతూ ఫన్నీగా విశ్లేషిస్తూ వీడియోలు చేస్తూ దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
కాగా గత కొంతకాలంగా సాహా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అబ్రదీప్ సాహాకు గత నెలలో మేజర్ ఆపరేషన్ జరిగిందని తెలుస్తుంది. లైఫ్ సేవింగ్ సపోర్ట్ సిస్టమ్మీద ఉన్నాడని, తొందరగా కోలుకోవాలని ప్రార్థించాలని అభిమానులను కోరుతూ అతని యూట్యూబ్ ఛానెల్ లో అప్డేట్ ఇచ్చారు. కాగా అవయవాల పనితీరు దెబ్బతినడంతో అబ్రదీప్ సాహా చనిపోయినట్లు తెలుస్తుంది. కేవలం 27 సంవత్సరాలకే మృత్యువాత పడటంతో ఆయన అభిమానులు, నెటిజన్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ట్వీట్లు, కామెంట్లతో సామాజిక మాధ్యమాల్లో నెంబర్-1 స్థానంలో యాంగ్రీ రాంట్ మ్యాన్ పేరు ట్రెండింగ్ అవుతుండటం గమనార్హం.