చంద్రబాబు నాయుడి పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనమైంది. కార్పొరేట్కు కొమ్ము కాస్తూ ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయలేదు. దీంతో అరకొరగా పిల్లలు ఉండేవారు. ప్రతి సంవత్సరం స్కూళ్ల పునఃప్రారంభం నాటికి పాఠ్యపుస్తకాలు సిద్ధంగా ఉండేవి కాదు. పూర్తిగా ఇచ్చిన సందర్భాల్లేవు. అరకొరగా లేటుగా ఇచ్చి బయట దుకాణాల్లో కొనుగోలు చేసుకోండని చెప్పేవారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ప్రతి ఏడాది బడుల పునఃప్రారంభం రోజు నుంచే విద్యాకానుక కిట్లు అందజేస్తున్నారు. బ్యాగ్, […]